Thursday, 30 July 2026 05:18:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మత్స్యకారుల నష్టాలు గుర్తిస్తున్నారా

పార్లమెంటులో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

Date : 08 August 2023 07:43 PM Views : 572

Famous TV - జాతీయ వార్తలు / : గత మూడేళ్లలో మత్స్యకారులు సముద్ర చేపల వేట ద్వారా కలిగిన నష్టాలను కేంద్ర ప్రభుత్వం నమోదు చేసిందా, ఎక్కువ నష్టాలు సంభవించడానికి గల కారణాలు మరియు దానిని పరిష్కరించడానికి తీసుకున్న చర్యల ఏమిటి, దేశంలోని మత్స్యకారులు అధిక డీజిల్ ధరలతో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం గుర్తించిందా, అలా అయితే మత్స్యకార సంఘానికి డీజిల్ సబ్సిడీని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నద అలా అయితే దాని వివరాలు మరియు కాకపోతే దానికి గల కారణాలు తెలుపగలరు అంటూ పార్లమెంటులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మత్స్య శాఖా మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల సమాధానం ఇస్తూ మొదటి మూడు ప్రశ్నలకి సమాధానం లేదు అని చెబుతూ గత మూడు సంవత్సరాలలో సముద్రంలో చేపల వేట అనంతరం నష్టాలు సంభవించినట్లు మత్స్య మంత్రిత్వ శాఖకి ఎలాంటి నివేదికలు అందలేదని భారతదేశంలో అత్యధికంగా మత్స్యరంగంలో స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన అభివృద్ధి ద్వారా నీలి విప్లవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో “ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎస్.ఎస్.వై)” పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని తెలియజేసారు. ప్రధానంగా చేపల వేట అనంతర నష్టాలను తగ్గించడం, ఆధునీకరించడం మరియు పటిష్టం చేయడం లక్ష్యంగా 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 వరకు 5 సంవత్సరాల కాలానికి ఫిషరీస్ రంగంలో ₹.20050 కోట్ల పెట్టుబడి పెట్టామని అన్నారు. మార్కెట్ల ఏర్పాటు మరియు మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, కోల్డ్ చైన్ స్టోరేజీ సౌకర్యాలు మరియు పంట కోత అనంతర రవాణా సౌకర్యాలు కల్పించడం. ఇంకా, ఫిషరీస్ రంగానికి మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి, ఫిషరీస్ శాఖ, ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కూడా ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో రాయితీ ఫైనాన్స్ అందించడం కోసంగా రూ.7522.48 కోట్లతో రూపొందించిందని అన్నారు. దేశంలో డీజిల్ ధరలు 19.10.2014 నుండి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరను బట్టి నిర్ణయించబడతాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం తెసుకోందని అప్పటి నుండి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు డీజిల్ ధరపై మార్కెట్ కి అనుగుణంగా నిర్ణయం తీసుకుంతున్నాయని చెబుతూ అదే సమయంలో, మత్స్యకారుల కోసం డీజిల్ ధరలను నియంత్రించడానికి సబ్సిడీ/పన్ను మినహాయింపులు లేదా రీయింబర్స్‌మెంట్‌లను అందించే వివిధ విధానాలు వివిధ తీరప్రాంత రాష్ట్రాలులలో ఉన్నాయని తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: