Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి, ఆగస్ట్ 07: తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న గౌ. జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ హంస్ రాజ్ గంగారం ఆహిర్ గారికి ఆలయ సూరింటెండెంట్ శేషగిరి స్వాగతం పలికారు. చైర్ పర్సన్ ముందుగా ఆలయ ధ్వజ స్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా ఆలయ సూపరింటెండెంట్ తీర్థ ప్రసాదాలు అందించారు. వీరి వెంట మాజీ టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు
Admin
Famous TV