Saturday, 13 June 2026 12:24:38 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

కాటన్ మిల్లు పునరుద్ధరించండి

కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో తిరుపతి ఎంపీ గురుమూర్తి భేటీ

Date : 04 August 2023 04:17 PM Views : 488

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖామాత్యులు పీయూష్ గోయల్ గారితో సదరు మంత్రిత్వ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో తిరుపతి కాటన్ మిల్లుతో పాటుగా హస్తకళల సేవా కేంద్రం ఏర్పాటు గూర్చి చర్చించారు. గతంలో జౌళి మంత్రిత్వ శాఖ కాటన్ మిల్లు పునరుద్ధరణ గూర్చి సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖకి సంబందించిన నీతీ ఆయోగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగంతో సంప్రదించి పునరుద్దరణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలియజేసారని అందుకు సంబందించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయనకి చూపిస్తూ దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న సుమారు 1000 కుటుంబాలకు ఈ మిల్లు జీవనోపాధిని కల్పిస్తున్నదని దయచేసి మిల్లు పునరుద్దరణకు సహకరించాలని కోరగా అనంతరం నీతీ ఆయోగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ నుండి సమాధానం వచ్చిన పిదప దేశం లోని మొత్తం 23 కాటన్ మిల్లుల గూర్చి నిర్ణయం తీసుకొంటామని ఉద్యోగులకి పెండింగ్ లో ఉన్న జీతాలని కూడా ఇస్తామని చెప్పారని ఎంపీ తెలియజేసారు. అలాగే తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో కలంకారీ వంటి పురాతన ప్రసిద్ధ హస్తకళలను ప్రోత్సహించడం కోసం తిరుపతిలో హస్తకళల సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని, హస్తకళలు మార్కెట్ చేసేందుకు తిరుపతిలో మంచి అవకాశం ఉన్నందున ప్రాధాన్యతా ప్రాతిపదికన తమ ప్రతిపాదనలను పరిశీలించవలసిందిగా ఆయనను కోరగా సూనుకూలంగా స్పందించారని పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :