Famous TV - జాతీయ వార్తలు / : దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి లోని తన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ నిరుపేదల గుండె చప్పుడు ఎరిగిన వ్యక్తిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి మరణం తరువాత కూడా వారి గుండెల్లో కొలువైన మహోన్నత నాయకుడు డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని ఆయన చేసిన సేవలని స్మరించుకున్నారు. సామాన్యులకు కార్పొరేట్ వైద్యం, ఉన్నత విద్యను చేరువ చేసిన మహోన్నత నేత డా.వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ అడుగుజాడల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలను పుణికి పుచ్చుకొని గొప్ప సంక్షేమ పథకాలను అందిస్తూ రాజన్న పాలనకు దీటుగా పరిపాలిస్తున్నాడని అన్నారు.
Admin
Famous TV