Famous TV - జాతీయ వార్తలు / : ప్రపంచంలో ఎవరెస్ట్ అత్యంత ఎత్తైన శిఖరం. ఇది హిమాలయ పర్వతాలలో ఉంది. దీన్ని గౌరీ శంకర్ అని,సాగర మాత అని కూడాపిలుస్తారు.పర్వతారోహకులకు ఎవరెస్టు ఎక్కడం అనేది ఒక జీవితాశయంగా ఉంటుంది. నేపాల్ కు చెందిన టెన్జింగ్ నార్గే మరియు న్యూజిలాండ్ కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ కలసి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని 1953 లో మే 29 అధిరోహించి, ప్రపంచంలో మొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘనత సాధించారు. దిగ్గజ అధిరోహకుడు హిల్లరీ కన్నుమూసిన 2008 నుండి సర్ ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్జింగ్ నార్గే షెర్పా ఎవరెస్ట్ అధిరోహించిన జ్ఞాపకార్థం ఈ రోజు జరుపుకుంటారు టెన్సింగ్ నార్కేయొక్క జన్మనామం "నామ్గైల్ వాంగ్డీ ". నేపాలీ ఇండియన్ కు చెందిన వ్యక్తి. ఆయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన ఎడ్మండ్ హిల్లరీ తో కలసి ఎవరెస్టు శిఖరాన్ని మే 29 , 1953 లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు . టైమ్ మ్యాగజిన్ ప్రచురించిన 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రాచుర్యం పొందిన 100 మంది ప్రముఖులలో ఒకరిగా పేరు పొందారు.1953 లో ఆయన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వర్గానికి నాయకుడుగా నియమింపబడి మొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే అవకాశాన్ని పొందాడు.తన 20 సంవత్సరాల వయసులో ఇతర పర్వతారోహకులిద్దరు వైద్య పరీక్షలో విఫలం అయినందున ఈయనకు ఈ అవకాశం వచ్చింది. విజయం ఆయన వశమయింది. తర్వాత కాలంలో పలువురు ఈ శిఖరాన్ని అధిరోహించారు.అయితే పర్వతాలు ఎక్కడం అనేది ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రభుత్వాలు కూడా మిగతా క్రీడలకు ఇచ్చిన ప్రాధాన్యత పర్వాతారోహణకు ఇవ్వడం లేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పని చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో మాత్రం పలువురు విద్యార్థులు వివిధ శిఖరాలను అధిరోహించారు.ఇటువంటి స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది.
Admin
Famous TV