Wednesday, 29 July 2026 07:31:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సకాలంలో పన్నులు చెల్లిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది

Date : 27 August 2024 05:51 PM Views : 702

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : దేశంలో పెద్ద పరిశ్రమలు సకాలంలో పన్నులు చెల్లిస్తే వారిని ఆదర్శంగా తీసుకుని చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునే వారి కూడా త్వరగా పన్ను చెల్లింపు చేస్తారని తద్వారా దేశం ఆర్ధిక పురోభివృద్ధికి సహకరించిన వారు అవుతామని సీజీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ పి.ఆనంద్ కుమార్ కోరారు. తిరుపతి అమరావతి నగర్ లోని ఆడిట్ కమిషనరేట్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పన్ను చెల్లింపు చేసే వారి సంఖ్య 70 లక్షల నుంచి 1.40 కోట్లకు పెరగడం, మధ్యస్త పన్ను స్లాట్ 14.5 శాతం నుంచి 11.5 శాతానికి తగ్గించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం, సరళీకృత పన్ను చెల్లింపులతో వ్యాపారస్తులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆన్ లైన్ జీఎస్టీ నమోదు, క్రమబద్ధమైన రిటర్న్ ఫైలింగ్, ఆడిట్ ప్రక్రియలో మార్పు వచ్చిందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఎం. అంబి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ఏ మాలతీ, తిరుపతి సర్కిల్ సీజీఎస్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :