Wednesday, 29 July 2026 03:17:09 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు

గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్

Date : 12 December 2023 10:53 AM Views : 742

Famous TV - జాతీయ వార్తలు / : ఆర్ధిక మంత్రి ప్రతిపాదించిన ,గ్రాంట్స్ ,డిమాండ్లు మరియు అదనపు నిధులకు , తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలియచేస్తున్నాము మైచాంగ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాల్లో వేలాది హెక్టార్లలో పంట నాశనమైంది. రైతులు బాగా నష్టపోయారు దీనిని జాతీయ విపత్తు కింద చూడలిసిన అవసరముంది ,ఆంధ్రప్రదేశ్‌కు మధ్యంతర సాయం కోసం రూ. 5000 కోట్లు ఇవ్వాలని గతంలో నేను విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 500 కోట్ల కంటే తక్కువ మాత్రమే పంపిణీ చేశారు.దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గౌరవ ప్రధానిని కోరారు, ఏపీలో 22 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి, 10,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్ర బృందాన్ని పంపాలని, ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవడానికి త్వరగా నిధులు విడుదల చేయాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, వారిపై ఆర్థిక ప్రభావం వల్ల వారిలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు,దీనిపై కేంద్రం మానవీయతను చూపించాలని ఆ సభ డ్వ్రా రా కోరుతున్నాను ఆర్థిక మంత్రి జలశక్తి మంత్రిత్వ శాఖ కోసం వివిధ ప్రాజెక్టు ల కింద సుమారు 483 కోట్లను కోరడం. జరిగినది కానీ, ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పోలవరం మొదటి దశకు 31,625.36 కోట్లు మంజూరు చేసిందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని భావిస్తున్నాను. నేను గౌరవనీయులకు గుర్తు చేయాలనుకుంటున్నాను. 12,911 కోట్లను ఈ ఏడాది జూన్ 5న విడుదల చేసేందుకు ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారు. ఇప్పటికే 16,119 కోట్ల పనులు పూర్తి కాగా 15 వేల కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. ఆర్ధిక మంత్రి ఇప్పటికే 12,911 కోట్లను ఆమోదించినందున ఇప్పుడు, మొదటి దశకు అదనంగా 2,600 కోట్లు అవసరంఉంది , ఎలాంటి జాప్యం లేకుండా ఆ మొత్తాన్ని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు. ఈ సభలోనే హామీ ఇచ్చిన ఈ పవిత్రమైన వాగ్దానాలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరుతున్నాను AP పునర్వ్యవస్థీకరణ చట్టం, సెక్షన్ 93 ప్రకారం, 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా, . 10 సంవత్సరాల కాలం. ముగిస్తుంది , సరిగ్గా చెప్పాలంటే కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారత ప్రభుత్వం మరియు AP ప్రభుత్వ అధికారుల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నా , క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదు. దుగరాజపట్నం ఓడరేవు భారత ప్రభుత్వ హామీ. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2018 నాటికి మొదటి దశ పూర్తి చేయాలని చెబుతున్నా.. ఈ ప్రాజెక్టు ఇంకా ప్రారంభం కాలేదు., విశాఖపట్నం మరియు విజయవాడ-గుంటూరు-తెనాలిలో ప్రతిపాదించబడిన మెట్రో రైలు ప్రాజెక్టులు భారత ప్రభుత్వ హామీ. కానీ, ఇవి కూడా ప్రారంభం కాలేదు. కొత్త రైల్వే జోన్ అనేది భారత ప్రభుత్వం యొక్క మరొక హామీ. గతేడాది 106.89 కోట్లు మంజూరయ్యాయి. ఇది ఆదాయ వ్యయాలకు మాత్రమే. 2023-24లో 10 కోట్లు ఇచ్చారు. కానీ ఇంకా వాస్తవరూపం దాల్చలేదు. గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ భారత ప్రభుత్వం యొక్క హామీ. ఏమీ జరగలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో సమాన విద్యావకాశాలు కల్పించేందుకు వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వాటిని 12, 13వ ప్రణాళికా కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రణాళికలు రద్దుకావడం, నీతి అయోగ్ అమలులోకి వచ్చినప్పటికీ 10 ఏళ్లలో అంటే 2024 నాటికి వాటిని పూర్తి చేయాల్సి ఉంది,విభజన చట్టం ప్రకారం ఏపీలో ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, ఎన్ ఐ టీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు కావల్సి ఉంది. పూర్తి కావలిసిన విద్యాసంస్థల నిర్మాణం నత్తనడకన నడుస్తోంది ప్రధానమంత్రి గారిని నేను కోరుతున్నదల్లా . జూన్ 2024 గడువుకు ముందే భారత ప్రభుత్వం యొక్క హామీలు అమలుచేయమని పార్లమెంట్ సాక్షిగా కోరుతున్నాను.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :