Famous TV - జాతీయ వార్తలు / : డా. శ్రీనివాస్ ఏలూరి కి ఐక్య రాజ్య సమితి న్యూయార్క్ పర్యటన విజయవంతం ఖమ్మం కు చెందిన ప్రముఖ దౌత్యవేత్త డా. శ్రీనివాస్ ఏలూరి - న్యూయార్క్ (౮5 ) లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఆహ్వానం మేరకు తన పది రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 16 మరియు 24 తేదీలలో జరిగిన ఐక్యరాజ్య సమితి - సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగే సభలలో పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో డా. శ్రీనివాస్ ఏలూరి జెండర్ ఈక్వాలిటీ ప్రాముఖ్యత గురించి మరియు అణు ఆయుధ నిర్ములన దిశగా అడుగులు వేసి ప్రపంచ శాంతి బాటలు వేయాలని కోరారు. ఈ సందర్బంగా డా. శ్రీనివాస్ ఏలూరి మాట్లాడుతూ మహిళల విద్య మరియు ఆర్థిక అభివృద్ధి దేశాల అభివృద్ధికి బాసట వేస్తుందని - లింగ సమానత్వం కు మొదటి మెట్టుఅని తెలియజేస్తూ - ప్రస్తుత ప్రపంచ - రష్యా మరియు ఉక్రెయిన్ నేపథ్యంలో అణు ఆయుధ నిర్ములన అత్యవసరమని లేకపోతే మానవజాతి మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని, కాబట్టి అణు ఆయుధ నిర్ములనకు అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చినట్లు డా శ్రీనివాస్ ఏలూరి తెలియజేసారు. ఐక్య రాజ్య సమితి న్యూయార్క్ లో మన తెలంగాణ వానిని వినిపించిన డా. శ్రీనివాస్ ఏలూరిని - తొషియా హోషినో, దానిఏళ్ల మొలగాలిన్, నిఖిల్ సేథ్ మరియు హిదేహూకో హిజ్కి వంటి అంతర్జాతీయ ప్రముఖులు అభినందించారు. డా. శ్రీనివాస్ ఏలూరి కి ఐక్య రాజ్య సమితి మాట్లాడిన ముఖ్యాంశాలు: 1. ప్రజలు అన్వాస్తాలు కోరడంలేదు కానీ అన్నవస్తాలు కోరుకుంటున్నారు. 2. అణు ఆయుధ యుద్ధాలు మానవత్వంపై ఉగ్రవాదంలారటేది నె. అన్ని దేశాలు కలిసి ఒక కాలపరిమితిలో అణు ఆయుధాలు నిర్ములించాలి 4. అణు ఆయుధాలు విషయంలో ప్రపంచ దేశాలు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి.
Admin
Famous TV