Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : మన భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయంగా భావించే వ్యక్తి గురువు. ‘ఆచార్యదేవోభవ’ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కీర్తిస్తాం. మన తల్లిదండ్రుల కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలివితేటలు, ఆలోచనల గురించి గురువులకే పూర్తిగా తెలుస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గినట్టనిపించినా.. మనసు పక్కదారి పట్టినట్టు గుర్తించినా దండిస్తారు. సరైన దారిలో నడిపిస్తారు. అందుకే గురువును మించిన దైవం లేదంటారాని *తిరుపతి ఎంపీ గౌ: డా. మద్దిల గురుమూర్తి* గారు తెలిపారు. తన స్వగ్రామమైన ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామం ఉపాధ్యాయుడు గుమ్మడి మురళి ఇటీవల dr సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డ్ పొందిన సందర్భంగా తన ఆఫీసు లో శాలువా తో సత్కరించారు. మన్నసముద్రం గ్రామం హర్షించదగిన విషయం అని కొనియాడారు. సన్మాన గ్రహీత గుమ్మడి మురళి మాట్లాడుతూ మహోన్నతమైన ఈ వృత్తిలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని , అభినందనలు తెలిపిన ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Famous TV