Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి పూజారి రెడ్డి బాబు డాక్టరేట్ పొందారు. స్పెక్ట్రోస్కోపిక్ అండ్ ఎక్సైటెడ్ స్టేట్ డైనమిక్స్ ఆఫ్ అయాన్స్ డౌట్ ఆల్కలి మెటల్స్ బేస్డ్ పాస్పేట్స్ గ్లాసెస్ ఫర్ విజిబుల్ డివైస్ డిస్ప్లే అప్లికేషన్స్ అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని రూపొందించారు. ఈయన రూపొందించిన పరిశోధనా వ్యాసాలు ప్రముఖ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ పరిశోధనకు ఆచార్య బి. దేవప్రసాదరాజు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ మేరకు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు.
Admin
Famous TV