Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు కాలేజ్ డే ఘనంగా నిర్వహించారు. అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ వైద్య కళాశాల విచ్చేసిన సందర్భంగా నాకు నేను నా ఎం.బీ.బీఎస్,చదువుకున్న రోజుల గుర్తుకొస్తున్నాయి అని అన్నారు. ప్రతి ఒక్క వైద్యుడు పేద రోగులకు వైద్యం అందించాలని, గ్రామీణ ప్రాంతంలో కొంతకాలం పనిచేసే అనుభవం తెచ్చుకొని పీజీ వైద్య విద్య చేరినట్లయితే ఇంకా మెరుగైన వైద్యం అందించవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే ఎస్వీ వైద్య కళాశాల పరిశోధనలో ముందడుగు వేయడం ఎంతో సంతోషంగా ఉందని, వైద్య పరిశోధనల్లో ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలలో పోటీపడి పరిశోధనలలో చొచ్చుకపోవడం, తిరుపతి ఎస్ వి వైద్య కళాశాలకు ఎంతో తోడ్పాటున అందిస్తుందని, వైద్య విద్యార్థులకు, రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో , ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోటీపడివైద్యంలో మనం మెరుగైనవైద్యం అందించబోతున్నామని, ఈ సందర్భంగా తెలపడానికి చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. భారత ప్రధాని చెప్పినట్లు వైద్యరంగంలోన మార్పులు రాబోతున్నాయని, ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు అని ఆయన అన్నారు. వైద్యం ఒకటే కాకుండా చదువుకున్న రోజుల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఒత్తిడి, గురికాకుండా చదువుకోవాలని వైద్య విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. *మరుగైన వైద్య విద్యను నేర్చుకోండి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించండి* ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి డాక్టర్ పార్థసారధిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ సునీత, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ మాధవి లత, అన్ని విభాగాధిపతులు, యు జి. వైద్య విద్యార్థులు, వైద్య కళాశాల సిబ్బంది, మరియు పి.ఆర్ఓ. వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV