Saturday, 13 June 2026 12:12:47 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

వంద శాతం అక్షరాస్యత సాధన

అభినందించిన రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్

Date : 09 July 2023 04:04 PM Views : 407

Famous TV - విద్య ఉద్యోగాలు / గుంటూరు : మచిలీపట్నం జులై 9:--- వంద శాతం అక్షరాస్యత సాధనలో తన వంతు కృషిచేసి జి ఈ ఆర్ బ్యాడ్జ్ పొందిన ఓ వాలంటీర్ను వారి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అభినందించిన అరుదైన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తన పర్యటనలో భాగంగా గుడివాడ మున్సిపల్ పట్టణంలోని 28వ వార్డు బేతవోలు-2 సచివాలయం లో వాలంటీర్ గా పనిచేస్తున్న ఎండ్రపు కల్పన ఇంటికి వెళ్లి ఆమెను అభినందించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో వార్డు వాలంటీర్ కల్పన తన క్లస్టర్ పరిధిలో ఉన్న 21 మంది 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ నూటికి నూరు శాతం పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ చేసినందుకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జి ఈ ఆర్)బ్యాడ్జ్ లభించింది. ఈ విషయం ఆన్లైన్లో గమనించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆమె ఇంటికి వెళ్లి ఆమె ఎన్రోల్మెంట్ చేసిన విధానాన్ని, ఎవరెవరు ఎక్కడ, ఏమి చదువుతున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో సంతృప్తి చెందిన కార్యదర్శి ఆమెను అభినందించారు. ఆమె కుటుంబ సభ్యులతో కలసి వారు ఫోటో దిగారు. దీంతో వాలంటీర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తనలాంటి వాలంటీర్లు చేసే పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అభినందిస్తారా అని ఆశ్చర్యపోయింది. తన ఇంటికి వచ్చి తనను అభినందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇది మరెందరో తన లాంటి వాలంటీర్లు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని నూరు శాతం అక్షరాస్యత సాధించుటలో పాఠశాల విద్య కార్యదర్శి చేస్తున్న అవిశ్రాంత కృషికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతు మద్దతు ఇస్తున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :