Famous TV - విద్య ఉద్యోగాలు / Hyderabad : తిరుపతికి చెందిన ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి జాతీయ శిక్షకునిగా అర్హత సాధించారు. హైదరాబాదులో జరుగుతున్న జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జాతీయ సదస్సులో ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు సి ఆర్ రాకేష్ శర్మ ఆదివారం దృవీకరణ పత్రం అందించారు. జెసిఐ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్న హర్షవర్ధన్ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ కోర్సులో ప్రతిభ చూపడం వల్ల ఈ గౌరవం దక్కింది. ఐఐఎం అహ్మదబాద్ పూర్వ విద్యార్థి అయిన ఆయన జెసిఐ తిరుపతి చాప్టర్ అధ్యక్షుడు స్థాయి నుంచి అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగారు. దీని పట్ల తిరుపతికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Famous TV