Wednesday, 29 July 2026 08:34:18 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మండల విద్యాశాఖ కార్యాలయం లో ఘనంగా ఉపాద్యాయ దినోత్సవం

Date : 06 September 2025 09:39 PM Views : 703

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవీ న్యూస్ : చిత్తఃరు జిల్లా, చౌడేపల్లి: మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఉపాధ్యాయ దినోత్సవాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కేశవ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులలో అభ్యసనా సామర్ధ్యాలను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్యా ప్రమాణాలలో మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని ఉపాధ్యాయులను కోరడం జరిగినది.ఎం.ఈ.ఓ 2 శ్రీమతి తిరుమలమ్మ మాట్లాడుతూ మండలంలో ప్రతి ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేస్తూ అందరిని అభినందించడం జరిగినది. మండల యస్టీయూ అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి దేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ని ఆదర్శంగా తీసుకొని, ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలియజేయడం జరిగినది. యుటియఫ్ అధ్యక్షులు సహదేవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన ప్రతి పనిని సకాలంలో పూర్తిచేసి రిపోర్టులను మండలానికి, జిల్లాకు పంపి మన మండలం యొక్క ప్రతిష్టను పెంచాలని కోరడం జరిగినది.సి. పి. యస్ అధ్యక్షులు వసంత మాట్లాడుతూ మండలంలో మహిళా ఉపాధ్యాయులందరూ బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయాలని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ సహకారాలు అందించి వారి విద్యభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఎం.ఈ.ఓ గా ఎన్నికైన తిరువల్లమ్మ ని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సురేష్ ని, మండల సీనియర్ ఉపాధ్యాయులు బి ఎన్ ప్రకాష్ ని, పుష్పలత ని, కృష్ణారెడ్డిని, మండల ఉపాధ్యాయుల తరఫున ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఏవి సుబ్రహ్మణ్యం, సుధాకర్ నాయుడు, జగన్మోహన్ రెడ్డి, బాబు రమేష్, ఆంజనేయులు, మురళి, తులసి నాగరాజ, రామకృష్ణ, ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :