Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంగా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వే ఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు భారతదేశం: విజన్ 2047 అనే అంశం మీద చిత్రలేఖన పోటీలను నిర్వహించారు విద్యార్థులు వారు చదువుతున్న తరగతి ఆధారంగా 3 విభాగాలలో పోటీలను నిర్వహింపబడినది. 1 - 4వ తరగతి విద్యార్థులు చిన్నారులు మరియు 5 - 7వ తరగతి విద్యార్థులు జూనియర్లకు 12 ఆగస్టు 2023 నందు మరియు 8-10వ తరగతి సీనియర్లకు 13 ఆగస్టు 2023న పోటీలు నిర్వహించబడ్డాయి. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, కడప, అన్నమయ్య, చెన్నైకి చెందిన దాదాపు 45 పాఠశాలల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు పోటీలో చురుకుగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు 15 ఆగస్టు 2023న మధ్యాహ్నం 3.00 గంటలకు పంపిణీ చేయబడతాయి.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పురుషోత్తం, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య, ముని లక్ష్మి,వినయ్ కుమార్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.
Admin
Famous TV