Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : అన్నమయ్యజిల్లా పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీలేరు సుండుపల్లి సర్వీస్ ఆర్టీసి బస్సు డ్రైవర్ ఎన్టీఆర్ నగర్ కు చెందిన V రాజ్ గోపాల్ 62 సుండుపల్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో kVపల్లి గర్నిమిట్టకు చేరుకొన్నారు. ఆక్రమంలో డ్రైవర్ రాజ్ గోపాల్ గుండె నొప్పిగా ఉందని అనడంతో ప్యాసింజర్ తో బస్సు పక్కన పెట్టారు. అక్కడినుండి గర్నిమిట్ట హాస్పిటల్ కు వెళ్లడంతో అక్కడి వైద్యులు పీలేరు కు అంబులెన్స్ ద్వారా తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మృతుడు రాజ్ గోపాల్ కు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు. మూడు నెలల్లో రిటైర్ అవుతాడని ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు.ఆ సర్వేస్ లో కల్లూరు కుచెందిన మల్లికా బేగం కండక్టర్ డ్యూటీలో ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి సందర్భంలో మృతిచెందడం బాధా కరమని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు
Admin
Famous TV