Saturday, 13 June 2026 12:23:19 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఫేమస్ టివి న్యూస్ ఎఫెక్ట్ బోయకొండ ఘటన లో చీటింగ్ కేసునమోదు

Date : 24 July 2025 08:16 PM Views : 586

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : బోయకొండ ఘటన లో చీటింగ్ కేసునమోదు చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం, జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రం గా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ దేవస్థానం లో ఆలయ అధికారుల కళ్ళుగప్పి దోచేసిన ఆది, మంగళ, బుద, గురు వారాల్లో జంతుబలులు సమర్పిస్తూ, తమ కోరికలు తీర్చాలని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. గతం లో ఇక్కడ పెద్దబోగం, చిన్న బోగం అంటూ ఏర్పాటు చేసి ప్రస్తుతం కూడా వాటిని టెండర ద్వారా వేలం వేయడం జరిగింది. అంటే అమ్మవారికి మొక్కలు తీర్చుకొనేవారు అమ్మవారికి సమర్పించే జంతుబలులకు సంబందించి, శుభ్రంచేయడానికి, తలలను అమ్ముకోవడానికి వేలం ద్వారాపాట జరిగినది, అక్కడ వేలం పాటదారులు వారి నిబందనల ప్రకారం చిన్నభోగము, పెద్దభోగము శుభ్రపరచడం, తలలు వేలం వేసుకుంటున్నారు. ఐతే 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి పెద్దబోగమూ, చిన్నభోగము అమ్మవారి మొక్కలు చెల్లించడానికి వచ్చిన వాటినుండి అమ్మవారి కి ఆదాయం కొరకు, అలాగే ప్రతిరోజు ఎన్ని బలులు సమర్పించారనే సంఖ్య ఖచ్చితంగా ఉండాలని, ప్రతి చిన్నభోగము, పెద్దభోగము కు రెండూవందల రూపాయలు టికెట్టు ఏర్పాటు చేసి, అందులో రశీదులను రెండుగా చేస్తూ ఒకటి భక్తులకు ఇచ్చేవిధముగా, రెండవది దేవస్థానం కు ఉండే విధముగా ఏర్పాటు చేశారు. ఐతే మొదట్లో సవ్యంగా జరిగిన వ్యవహారం, రానురాను రెండు రశీదులు కూడా భక్తులకు ఇచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది తమ జేబులు నింపుకునేవారు. పర్యవేక్షణ అధికారులు వచ్చి రశీదు పుస్తకాలు పరిశీలించకుండా ఎన్నివచ్చాయి, ఎఃత వసూలు అయ్యిందని అడిగి వెళ్ళేవాళ్ళు, ఇదే అదునుగా భావించి దేవస్థానం నందు పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆరుగురు విద్వాన్ నాగముని, సోమశేఖర్ రాజు, హరిప్రసాద్, మునిశేఖర్, గంగరాజు, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సొమ్మును స్వాహా చేసినట్లు తెలిసినది. జులై నెలలో రికారడలు, రశీదు పుస్తకాలు పరిశీలన చేయగా నలబై ఏడువేల రెండువందల రూపాయలు తేడాలున్నాయని, మొదటి నుండి పరిశీలించిన యడల ఇంకా బయట పడే అవకాశం ఉందని ఆలయ కార్యనిర్వాహణాధికారి, మరియు ఉపకమీషనర్ ఏకాంబరం తెలియజేశారు. ఈ విషయం పైన ఆయన దేవాదాయ కమీషనర్ కు పిర్యాదు చేసి, కమీషనర్ వారి ఆదేశానుసారం, చౌడేపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. సదరు పిర్యాదు పై విచారణ చేసిన చౌడేపల్లి ఎస్సై నాగేశ్వరావు గురువారం సదరు వ్యక్తుల పై చీటింగ్ కేసునమోదు చేయడమైనదని, పత్రికాప్రకటనలో తెలియజేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :