Sunday, 19 April 2026 05:34:05 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ద్విచక్ర వాహనాలను దొంగలించే అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

20 లక్షలు విలువ చేసే 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Date : 02 July 2023 01:31 PM Views : 368

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : గత కొన్ని రోజులుగా చిత్తూరు, తవణంపల్లి, బంగారుపాళ్యం మండలాలలో మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున, రాజశ్రీ చిత్తూరు జిల్లా SP శ్రీ.Y.రిశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ DSP శ్రీ K.శ్రీనివాస మూర్తి గారి పర్యవేక్షణలో, చిత్తూరు రూరల్ వెస్ట్ CI శ్రీ I.రవిశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తవణంపల్లి P.S., SI, P.V.సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది సహితంగా ఈ దినం అనగా 01-07-2023 వ తేదిన తవణంపల్లి మండలం, పట్నం గ్రామ సమీపంలో గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద 01.00 PM గంటలకు C.గోవింద రాజ్, వయస్సు 29 సం”లు, S/o C.శివరాజ్, గుట్టక్రింద హరిజనవాడ గ్రామం, కీనాటంపల్లి పోస్టు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా అను అతనిని అరెస్టు చేసి, అతని వద్ద వుండిన 01 మోటార్ సైకిల్ ను మరియు అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు అతను వివిధ ప్రాంతాలలో దొంగలించి దాచి ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన మరో 21 ద్విచక్రవాహనాలు, అనగా మొత్తం సుమారు 20 లక్షల రూపాయల విలువ 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోవడమైనది. సదరు C.గోవింద రాజ్ తవణంపల్లి PS పరిధిలో 6 మోటార్ సైకిళ్ళు, బంగారుపాళ్యం PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, చితూరు I Town PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, G.D.నెల్లూరు PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, SR పురం PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, ఇంకా వివిధ ప్రాంతాలలో మరో 8 మోటార్ సైకిళ్ళను దొంగతనం చేయడమైనది. పట్టుబడిన ముద్దాయి యొక్క వివరాలు: C.గోవింద రాజ్, వయస్సు 29 సం”లు, S/o C.శివరాజ్, గుట్టక్రింద హరిజనవాడ గ్రామం, యాదమరి మండలం, కీనాటంపల్లి పోస్టు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా. ఈ కేసు లో పాల్గొన్న తవణంపల్లి SI, P.V.సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని అభినందించినారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :