Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : గత కొన్ని రోజులుగా చిత్తూరు, తవణంపల్లి, బంగారుపాళ్యం మండలాలలో మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున, రాజశ్రీ చిత్తూరు జిల్లా SP శ్రీ.Y.రిశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ DSP శ్రీ K.శ్రీనివాస మూర్తి గారి పర్యవేక్షణలో, చిత్తూరు రూరల్ వెస్ట్ CI శ్రీ I.రవిశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తవణంపల్లి P.S., SI, P.V.సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది సహితంగా ఈ దినం అనగా 01-07-2023 వ తేదిన తవణంపల్లి మండలం, పట్నం గ్రామ సమీపంలో గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద 01.00 PM గంటలకు C.గోవింద రాజ్, వయస్సు 29 సం”లు, S/o C.శివరాజ్, గుట్టక్రింద హరిజనవాడ గ్రామం, కీనాటంపల్లి పోస్టు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా అను అతనిని అరెస్టు చేసి, అతని వద్ద వుండిన 01 మోటార్ సైకిల్ ను మరియు అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు అతను వివిధ ప్రాంతాలలో దొంగలించి దాచి ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన మరో 21 ద్విచక్రవాహనాలు, అనగా మొత్తం సుమారు 20 లక్షల రూపాయల విలువ 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోవడమైనది. సదరు C.గోవింద రాజ్ తవణంపల్లి PS పరిధిలో 6 మోటార్ సైకిళ్ళు, బంగారుపాళ్యం PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, చితూరు I Town PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, G.D.నెల్లూరు PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, SR పురం PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, ఇంకా వివిధ ప్రాంతాలలో మరో 8 మోటార్ సైకిళ్ళను దొంగతనం చేయడమైనది. పట్టుబడిన ముద్దాయి యొక్క వివరాలు: C.గోవింద రాజ్, వయస్సు 29 సం”లు, S/o C.శివరాజ్, గుట్టక్రింద హరిజనవాడ గ్రామం, యాదమరి మండలం, కీనాటంపల్లి పోస్టు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా. ఈ కేసు లో పాల్గొన్న తవణంపల్లి SI, P.V.సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని అభినందించినారు.
Admin
Famous TV