Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని ఏ.కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లి గ్రామంలో మార్చి నెల 30వ తేదీన తండ్రి చిన్నపరెడ్డిపై అతని కొడుకు మనోహర్ రెడ్డి తీవ్రంగా దాడి చేసి గాయపరిచి నందున మార్చి 31వ తేదీన అతని పైన, అతని భార్య సరస్వతమ్మ పైన కేసు నమోదు చేయడం జరిగింది. చిన్నపరెడ్డి ఏప్రిల్ నెల 9వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినాడు, తీవ్ర మనోవేదనకు గురైనందున ఏప్రిల్ 21వ తేదీన మరణించినాడు, ఈ కేసులో పరారీలో ఉన్న ముద్దాయి అయిన కొడుకు మనోహర్ రెడ్డిని జూన్ 16న అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పుంగనూరు కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగిందని. త్వరలో మనోహర్ రెడ్డి భార్య సరస్వతిని కూడా అరెస్టు చేయడం జరిగుతుందని యస్సై నాగేశ్వర్ రావు తెలిపారు.
Admin
Famous TV