Monday, 02 March 2026 12:21:57 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించండి - డి ఆర్ ఓ కె.మోహన్ కుమార్

Date : 21 January 2026 07:18 PM Views : 437

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026 లో భాగంగా జనవరి 27 నుండి ఫిబ్రవరి 10 వరకు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని డి ఆర్ ఓ కె.మోహన్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని డి ఆర్ ఓ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు – 2026 లో భాగంగా జనవరి 27 నుండి పిబ్రవరి 10 వ తేదీ వరకు మొదటి, ద్వితీయ సంవత్సరానికి సంబందించి ప్రాక్టికల్ పరీక్షలను 71 సెంటర్ల (ఒకేషనల్ సెంటర్లతో) కలిపి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.మొదటి సంవత్సరం థియరీకి సంబందించి 14,729 మంది, ద్వితీయ సంవత్సరం థియరీకి సంబందించి 14,550 మంది, మొత్తం 29,279 మంది హాజరు అవుతారని, ప్రాక్టికల్ మొదటి సంవత్సరానికి సంబంధించి 1470 మంది, ప్రాక్టికల్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9937 మంది, మొత్తం 11,407 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చర్యలు చేపట్టాలని,సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆర్ టి సి వారు బస్సులను నడపాలని,పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించుటలో సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా వారు పరీక్షా కేంద్రాల వద్ద ఏమైనా సంఘటనలు జరిగితే డిఐఈఓ వారి దృష్టికి తీసుకొని వెళ్లాలన్నారు.ఈ సమావేశంలో డిఐఈఓ ఏ.రఘుపతి,టు టౌన్ సి ఐ నెట్టికంఠయ్య,సి సెక్షన్ సూపరింటెండెంట్ బ్యూలా,జిల్లా పరీక్షల నిర్వాహణ కమిటీ సభ్యలు ఎన్.సయ్యద్ మౌల,ఎన్.దయానంద రాజు,మురళీధర్,వెంకటరమణ రెడ్డి, జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్, మెడికల్,విద్యుత్,ఏ పి ఎస్ ఆర్ టి సి,పోస్టల్,ఇతర సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :