Wednesday, 29 July 2026 08:13:31 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించండి - డి ఆర్ ఓ కె.మోహన్ కుమార్

Date : 21 January 2026 07:18 PM Views : 677

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026 లో భాగంగా జనవరి 27 నుండి ఫిబ్రవరి 10 వరకు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని డి ఆర్ ఓ కె.మోహన్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని డి ఆర్ ఓ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు – 2026 లో భాగంగా జనవరి 27 నుండి పిబ్రవరి 10 వ తేదీ వరకు మొదటి, ద్వితీయ సంవత్సరానికి సంబందించి ప్రాక్టికల్ పరీక్షలను 71 సెంటర్ల (ఒకేషనల్ సెంటర్లతో) కలిపి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.మొదటి సంవత్సరం థియరీకి సంబందించి 14,729 మంది, ద్వితీయ సంవత్సరం థియరీకి సంబందించి 14,550 మంది, మొత్తం 29,279 మంది హాజరు అవుతారని, ప్రాక్టికల్ మొదటి సంవత్సరానికి సంబంధించి 1470 మంది, ప్రాక్టికల్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9937 మంది, మొత్తం 11,407 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చర్యలు చేపట్టాలని,సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆర్ టి సి వారు బస్సులను నడపాలని,పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించుటలో సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా వారు పరీక్షా కేంద్రాల వద్ద ఏమైనా సంఘటనలు జరిగితే డిఐఈఓ వారి దృష్టికి తీసుకొని వెళ్లాలన్నారు.ఈ సమావేశంలో డిఐఈఓ ఏ.రఘుపతి,టు టౌన్ సి ఐ నెట్టికంఠయ్య,సి సెక్షన్ సూపరింటెండెంట్ బ్యూలా,జిల్లా పరీక్షల నిర్వాహణ కమిటీ సభ్యలు ఎన్.సయ్యద్ మౌల,ఎన్.దయానంద రాజు,మురళీధర్,వెంకటరమణ రెడ్డి, జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్, మెడికల్,విద్యుత్,ఏ పి ఎస్ ఆర్ టి సి,పోస్టల్,ఇతర సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :