Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎర్రచందనం 21 లక్షల రూపాయలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. భాకారాపేట పోలీస్ స్టేషన్ లో సీఐ తులసీరాం వివరాలు వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయితీ భూతంవారిపల్లి సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమిళనాడుకు చెందిన తంగరాజ్, గణేష్, ఆనంద్, విజయరాసు, రాజేష్, రాజా, విగ్నేష్, తిరుపతి (8మంది) లను అరెస్టు చేశారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 5 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, మూడు రంపాలు, మూడు గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధనం చేసుకున్న ఎర్రచందనం విలువ 21 లక్షలు రూపాయల వరకు ఉంటుందని సీఐ తులసీరాం తెలియజేశారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కి తరలిస్తున్నామన్నారు. సంజూ అనే మోస్ట్ స్మగ్లర్ పరారీలో ఉన్నారని, వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సైలు ప్రకాష్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Admin
Famous TV