Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : రెండు వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన పీలేరు పరిధిలో చేస్తుంది అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామం పాలెం గడ్డ హరిజనవాడకు చెందిన యాటా చంద్ర, యాటా సుబ్బరాయుడు తన సొంత పనుల నిమిత్తం కారులో దేవపట్ల నుండి చెన్నైకి వెళుతుండగా చెన్నై నుండి కర్నూలు ఇనోవా వాహనంలో వెళ్తున్న వాహనం మంగళవారం ఉదయం పీలేరు మండల పరిధిలో ముడుపుల వేముల సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కారును ఇనోవా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది దీంతో స్థానికులు 108 వాహనం ద్వారా పీలేరు ప్రభుత్వఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తుంది పాలెం గడ్డ హరిజనవాడకు చెందిన చంద్ర (38) కుడికాలు పూర్తిగా నలిగిపోయి ఒళ్లంతా గాయాలు అయ్యాయి, అదే గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఏడమ చేయి విరిగి, తలకు తీవ్ర గాయలయ్యాయి, కారు డ్రైవర్ ప్రసన్నకుమార్ కు మోకాలు దగ్గర పెద్ద గాయమైంది, అదేవిధంగా చెన్నై నుండి కర్నూలు కి ఇనోవా లో నలుగురు ప్రయాణిస్తుండగా ఉదయ్ కి (22) ఎడమ చేయి షోల్డర్ చెస్ట్ దగ్గర గాయం అయింది మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు వీరిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం తిరుపతికి రిఫర్ చేశారు ఈ మేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Reporter
Famous TV