Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గొడవల్లో గాని, అల్లర్లలో గాని, అసాంఘిక కార్యక్రమాలలో గాని ఎవరు పాల్గొనకూడదు... అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవు. బహిరంగ ప్రదేశాలలో అల్లరి సృష్టించడం, మద్యపానం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాగే, ఆర్థిక నేరాలకు పాల్పడటం ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి గట్టి చర్యలు. భవిష్యత్తులో ఇలాంటి వారికి ఏరకమైన మినహాయింపులు వుండవు. ఏదైనా అలజడి సృష్టిస్తాము అనే ఆలోచన వుంటే మానుకోవాలి, ముఖ్యంగా నేరం చేయాలనే ఉద్దేశాన్ని మానుకోండి-మారండి. సమస్యలు వుంటే పోలీస్ వారి దృష్టికి తీసుకురండి. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు L&O శ్రీ కులశేఖర్ గారి అధ్వర్యలో తిరుపతి,చంద్రగిరి సబ్ డివిజన్ ల డిఎస్పీ లు శ్రీ సురేంద్ర రెడ్డి,శ్రీ యస్వత్ వారి సబ్ డివిజన్ సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు.
శుక్రవారం బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించి అల్లరి సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో విస్తృతంగా దాడులు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు తీవ్రమైన ఘటనలపై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు, అల్లరి మూకలు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చట్టం కఠినంగా ఉందని, సత్ప్రవర్తనతో మెలగక పోతే చర్యలు తీవ్రంగా అమలవుతుందనీ, మంచి నడవడిక సాధా అభిప్రాయం సమాజంలో కలిగేటట్లు చూసుకోవాలని, అలా కలిగినప్పుడే సానుకూల స్పందన వస్తుందని, అలా కాదని చట్టాన్ని చేతులో తీసుకుంటే, కఠిన చర్యలు తప్పవనీ, ఏవైనా అలజడి సృష్టించాలానే ఆలోచన వుంటే మానుకావాలి. ముఖ్యంగా నేరం చేయాలనే ఉద్దేశాన్ని మానుకోవాలి, పట్టు పడిన వారికి ఎటువంటి మినహాయింపు ఉండదు. అవాంచనీయ సంగటనలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వల్ల నిజ జీవితంలో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. దీనివలన మీ కుటుంబంతో పాటు అభం-శుభం తెలియని మీ పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున అందరు క్రమశిక్షణతో మెలగి మీ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మంచి పేరుతో సమాజంలో మీరు కూడా ఒక పౌరుడిగా ఉన్నట్లు మెలగి ప్రశాంతమైన వాతావరణంలో రౌడీ షీటర్లకు మరియు అల్లరి మూకలకు పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు.
Admin
Famous TV