Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫెమస్ టీవీ న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని దుర్గసముద్రం గ్రామపంచాయతీ, దుర్గసముద్రం యస్సీకాలనీలో వినాయకుడు నుండి మారెమ్మ గుడి వరకు దారి తరతరాలుగా గత యాభై సంవత్సరాలనుండి ఉన్నది. సదరు దారిని గ్రామానికి చెందిన ఊసన్న ఆలియాస్ కీరమంద వెంకట్రమణ అనువ్యక్తి ఆక్రమించుకొని, దారి పూర్తిగా మూసివేయడం జరిగింది. అక్కడ గతంలో బండిబాట ఉండేది. ఐతే ప్రస్తుతం కాలినడక మాత్రమే ఉంది. ఎవరైనా దారి విషయమై అడిగితే ఇది మా సెటిల్మెంట్ భూమి అని, మేము దారి వదిలే ప్రసక్తిలేదని అందరినీ బెదిరింపులకు గురిచేస్తున్నాడు. అతని ఆధినం ప్రభుత్వ ఆనాధీనం భూమి కొఃత ఉందని దానిని దారికి ఒదలాల్సిందిగా గ్రామస్తులు ఎన్నిసార్లు తెలియజేసిననూ ఆయన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన సందర్బాలు ఎన్నో ఉన్నాయని, వెంటనే రెవిన్యూ అధికారులు సదరు అనాధీనం భూమిని స్వాధీనం చేసుకొని, గ్రామం నుండి మారెమ్మ గుడికి దారిసౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరడమైనది. వెంటనే సంబందించిన అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి, దారి చూపి, ప్రభుత్వ భూమిని స్వాధిన పరుకోవాలని వారు అన్నారు.
Admin
Famous TV