Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొని కిందపడి తలకు తీవ్ర గాయాలు అయి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో జిటి కండ్రిగ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వెదురుకుప్పం మండలం జిటి కండ్రిగ వద్ద, అదే గ్రామానికి చెందిన వ్యక్తి పచ్చికాపలం నుండి తన పనులు ముగించుకొని వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే అతను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Admin
Famous TV