Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవీ న్యూస్ : అన్నమయ్య జిల్లాలోని, చౌడేపల్లి మండలంలోని కాగతి గ్రామపంచాయతీ, యనమసామనపల్లి కి కూతవేట దూరంలో ప్రీమియం కంపెనీ కి చెందిన కోళ్ళఫారాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కంపెనీ ప్రారంభించి సుమారు 11 సంవత్సరాలు కాలస్తుంది. గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి మేనేజర్లు చాలా వరకు పారిశుద్యం, ప్రజారోగ్యం ను దృష్టిలో ఉంచుకొని, వారం, పదిరోజులకొకసారి క్రిమిసంహారక మందులను పిచికారి చేసేవారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆరు సంవత్సరాలనుండి ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్, సిబ్బంది, యాజమాన్యం ఎవరు కూడా ప్రజారోగ్యం పైన దృష్టి సారించకపోవడంతో ఇక్కడ ఈగలు వ్యాప్తి చెందాయి, అంతే కాకుండా కోళ్ళ ఫారాలలో గల వ్యర్థాలను, వారు రీ సైక్లింగ్ చేసి, బయటకు సరఫరా చేయాల్సి ఉండగా, వాటిని అలాగే బహిరంగ ప్రదేశాలలో నిల్వవుంచడం వలన, అందులో గల వ్యర్థాలలో ఈగలు, దోమలు ఉత్పత్తై ఇటు పశుపక్షాదులు, ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సదరు ప్రీమియర్ కంపెనీ పై చర్యలు తీసుకోవల్సిన అధికారులు వాళ్ళు ఇచ్చే మామూళ్ళ మత్తులో మునిగితేలుచున్నారు. ఇక్కడి నుండి వెలువడే దుర్వాసన తో ప్రజారోగ్యం ఏవిధంగా దెబ్బతింటుందంటే చాలా వరకు గాలి కాలుష్యం అయి ఊపిరితిత్తులకు సంబందించిన, శ్వాసకోశ సంబందించిన రోగాలతో చుట్టుప్రక్కల సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అవస్థలుపడుతున్నారు. ఏక్కడ చూసినా ఈగలు, మంచి నీరు సైతం కలుషితం అవుతుంది. భోజనం చేయాలంటే దోమతెరలు వాడుకోవాల్సివస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఈగలు స్వాగతం పలుకుతున్నాయి. ఇన్ని విధాలుగా ప్రజారోగ్యం దెబ్బతింటున్న నేపత్యం లో యాజమాన్యం సరైన సస్యరక్షణ చర్యలు పాటించడంలో విఫలమౌతుందని గ్రామస్తులు వాపోతున్నారు. కావున వెంటనే సంబందించిన అధికారులు సదరు ఈగలు పైన, దుర్వాసన పైన విచారణ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరడమైనది.
Admin
Famous TV