Monday, 14 September 2026 06:52:10 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఇష్టానుసారంగా ఎర్రమట్టి దోపిడీ, రెవిన్యూ సిబ్బంది తీరుపై గ్రామస్తులు ఆగ్రహం

Date : 10 September 2025 08:13 PM Views : 1005

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని శెట్టిపేట గ్రామ పంచాయతీ, తోటకురప్పల్లి గ్రామం సమీపంలో ఆంజినేయుని గుండు సమీపంలో కొత్తపల్లికి చెందిన ఒక రైతు మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ట్రాక్టర్ లోడ్డు నాలుగు వందలా యాబై లెక్కన చేనుకు సుమారు రెండువందల లోడ్లు ఎర్రమట్టిని తోలుకోవడం జరిగింది.ఈ విషయం పైన ఉదయం పదకొండు గంటల సమయంలో గ్రామ రెవిన్యూ అధికారి రెడ్డెప్ప కు విషయం గ్రామస్తులు తెలియజేయగా, వెంటనే నిలుపుదల చేస్తామని చెప్పారని .ఐతే సాయంత్రంవరకు ఎర్రమట్టి తోలడం తో వారు సదరు విషయం రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయం లో రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం నిండుగా ఉఝడటంతో భారీగా చేతులు మారినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.శెట్టిపేట గ్రామ పంచాయతీ లో అడ్డగుట్ట ప్రాంతంలో ఈ విధముగా సుమారు రెండు ఎకరాల వరకు కొండను సైతం తవ్వి ఎర్రమట్టిని తోలుకోవడం పై పలు విమర్శలు వస్తున్నాయి.ఈ మట్టి మాఫియా గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతుందని,ట్రాక్టర్లతో మట్టి తోలుతున్నప్పుడు మార్గమద్యంలో గల ఇండ్లలో దుమ్ముదూళి నిండిపోతుందని, ఈ విషయం పైన ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని గ్రామస్తులు వాపోయారు. అంతే కాకుండా ఎవరైనా పత్రికా న్యూస్ రిపోర్టర్లు వెళ్ళి ఫోటోలు, విడియోలు తీసుకొని వస్తే వెంటనే రాజకీయ నాయకుల నుండి సదరు రిపోర్టర్లకు ఫోన్లు వెళ్తున్నాయి.వార్తాకథనాలు రాయవద్దని, న్యూస్ రిపోర్టర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పుకార్లు చేస్తున్నారు. వీళ్ళ పుకార్లకు భయపడి న్యూస్ రిపోర్టర్లు ముందుకు రావడం లేదు. అంటే పత్రికా స్వేచ్చ అంటే కూడా తెలియని నాయకులున్నారని ఇట్టే అర్థమౌతుంది.అంటే ఈ సంఘటన ఆధారంగా వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉందో కావున వెంటనే అధికారులు చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :