Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : పోక్సో కోర్ట్ జడ్జిమెంట్ . మదనపల్లి కు చెదిన 23 సంవత్సరములు వయషు కలిగిన పుట్టా ప్రసాద్ తనకు బంధువు అయిన 13 సం వయషు గలిగిన ఒక మైనర్ బాలికను 3-3-21 న సాయంత్రం మాయ మాటలు చెప్పి తన తల్లి తండ్రులకు తెలియకుండా ఆ బాలికను తన ఇంటివద్ద నుండి కిడ్నాప్ చేసుకొని స్కూటర్ పై బలవంతంగా తీసుకొని మదనపల్లి - పుంగనూరు బై పాస్ రోడ్ లోని ఎగువ చెరువు కుంట వద్ద గల గుట్టపై బలవంతంగా రేప్ చేసినాడు , మరలా 4 వ తేదీన అదే స్థలం కు తీసుకు వెళ్లి మరో సారి బలవంతంగా రేప్ చేసినాడు .5 వ తేదీన ఆ బాలిక ముద్దాయి చెర నుండి తప్పించుకొని ఇంటికి వెళ్లి తన తల్లి కి ని జరిగిన విషయం వివరము గా చెప్పినది .తన ఈ విషయం గురించి మదనపల్లి తాలూకు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడం తో ఆ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసారు . అప్పటి మదనపల్లి DSP కేసు దర్యాప్తు చేసి చిత్తూరు పోక్సో కోర్టు లో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు . చిత్తూరు పోక్సో కోర్టు లో కేసు విచారణ పూర్తి అయి ముద్దాయి పై నేరం రుజువు కాగా గౌరవ పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి శ్రీ ఎం శంకర రావు గారు ముద్దాయి కి ఈ రోజు తీర్పు చెప్పి 20 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష , మరియు 8,000 రూపాయలు జరిమానా విధించారు . బాధితురాలికి ఒక లక్ష రూపాయలు నష్ట పరిహారం ప్రభుత్వం తరపున చెల్లించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు . ఈ కేసు లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి V మోహనకుమారి ప్రాసిక్యూషన్ తరపున కేసు వాదించారు . లైసన్ ఆఫీసర్ శ్రీ సాయి సుధాకర్ , మదనపల్లి తాలూకు స్టేషన్ కోర్టు పోలీస్ హెడ్ కానిస్టేబులు సాక్షులను కోర్టు లో హాజరు పరిచారు .
Admin
Famous TV