Monday, 02 March 2026 12:22:08 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఫేమస్ టీవి న్యూస్ కు స్పందించిన అధికారులు

ఈగలు బాబోయ్ ఈగలు ఎటుచూసినా ఈగలే ఈగలు

Date : 18 January 2026 04:39 PM Views : 391

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : చౌడేపల్లి ఫేమస్ టీవీ న్యూస్ : అన్నమయ్య జిల్లాలోని, చౌడేపల్లి మండలంలోని కాగతి గ్రామపంచాయతీ, యనమసామనపల్లి కి కూతవేట దూరంలో ప్రీమియం కంపెనీ కి చెందిన కోళ్ళఫారాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కంపెనీ ప్రారంభించి సుమారు 11 సంవత్సరాలు కాలస్తుంది. గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి మేనేజర్లు చాలా వరకు పారిశుద్యం, ప్రజారోగ్యం ను దృష్టిలో ఉంచుకొని, వారం, పదిరోజులకొకసారి క్రిమిసంహారక మందులను పిచికారి చేసేవారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆరు సంవత్సరాలనుండి ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్, సిబ్బంది, యాజమాన్యం ఎవరు కూడా ప్రజారోగ్యం పైన దృష్టి సారించకపోవడంతో ఇక్కడ ఈగలు వ్యాప్తి చెందాయి, అంతే కాకుండా కోళ్ళ ఫారాలలో గల వ్యర్థాలను, వారు రీ సైక్లింగ్ చేసి, బయటకు సరఫరా చేయాల్సి ఉండగా, వాటిని అలాగే బహిరంగ ప్రదేశాలలో నిల్వవుంచడం వలన, అందులో గల వ్యర్థాలలో ఈగలు, దోమలు ఉత్పత్తై ఇటు పశుపక్షాదులు, ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సదరు ప్రీమియర్ కంపెనీ పై చర్యలు తీసుకోవల్సిన అధికారులు వాళ్ళు ఇచ్చే మామూళ్ళ మత్తులో మునిగితేలుచున్నారు. ఇక్కడి నుండి వెలువడే దుర్వాసన తో ప్రజారోగ్యం ఏవిధంగా దెబ్బతింటుందంటే చాలా వరకు గాలి కాలుష్యం అయి ఊపిరితిత్తులకు సంబందించిన, శ్వాసకోశ సంబందించిన రోగాలతో చుట్టుప్రక్కల సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అవస్థలుపడుతున్నారు. ఏక్కడ చూసినా ఈగలు, మంచి నీరు సైతం కలుషితం అవుతుంది. భోజనం చేయాలంటే దోమతెరలు వాడుకోవాల్సివస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఈగలు స్వాగతం పలుకుతున్నాయి. ఇన్ని విధాలుగా ప్రజారోగ్యం దెబ్బతింటున్న నేపత్యం లో యాజమాన్యం సరైన సస్యరక్షణ చర్యలు పాటించడంలో విఫలమౌతుందని గ్రామస్తులు వాపోతున్నారు. కావున వెంటనే సంబందించిన అధికారులు సదరు ఈగలు పైన, దుర్వాసన పైన విచారణ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరడమైనది.పత్రికలలో వార్తాకథనాలు రావడంతో స్పందించిన అధికారులు వెటనే ఈగల నివారణ కు మందులు పిచికారి చేయించారు. వారు పిచికారి చేసిన మందుల కు ఏమాత్రము ఈగలు చలించలేదని, తాత్కాలిక ఉపశమనం చేయడం వలన ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోయారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :