Friday, 16 January 2026 02:38:07 AM
# ఘనంగా కే.పి.ఏల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. # వార్త రాసుకొని ఏమి పీక్కుంటాడో పీక్కోని అంటూ శపతాలు # దళితుల పై దాడి,పైగా దోపిడి, నీ దిక్కున్న చోట చెప్పుకో # రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం # చిన్నపిల్లల విక్రయాల పై పిజిఆర్ఎస్ లో పిర్యాదు ఉపాద్యాయ వృత్తికే కళంకం చిన్నపిల్లల అమ్మకాలు # MJPBACWR పాఠశాల నందు గణిత అష్టావధానం. # అనాధ శరణాలయ నిర్వాహకుడి దాష్టీకం # అధికారుల నిర్లక్షమా లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా కరెంటు స్థంభం పై నుండి పడి కార్మికుడికి గాయాలు # లచంతీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ # ఇంటి పట్టాలు తీసిస్తామంటూ లక్షలు వసూలు చేసి పారిపోయిన విఆర్వో మీరెప్పుడిచ్చారు, # విధ్యను ఆయుధంగా చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అంబేద్కర్ # విజయవంతం గా కొనసాగిన పి ఫోర్ ప్రాజెక్ట్ పేదల అభివృద్దే ద్యేయం గా కూటమి ప్రభుత్వం # బాల్యవివాహాలు జరుగుతున్నా పట్టంచుకోని అధికారులు వెంటనే కేసులు నమోదు చేయాలి,కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు గీత # 27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలి # బోయకొండగంగమ్మ ను దర్శించుకొని, చౌడేపల్లి పర్యటన చేసిన --రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డా.షేక్ రోకేయా బేగం # అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి -- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # ఏపిఎస్ఈఎ డివిజన్ ఉపాధ్యక్షులుగా మురళీకృష్ణ # మైనర్ బాలిక ప్రేమ విషయం తెలిసి పెళ్ళిచేయాలని కుటుంబ సభ్యులు ప్రియుడుతో జంప్ చేసిన మైనర్ బాలిక # జర్నలిస్ట్ ల సంక్షేమమే జాప్ యూనియన్ ద్యేయం...

అపోలో యూనివర్సిటీ సంఘటన పై విచారణ

Date : 22 October 2025 07:57 PM Views : 494

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ న్యూస్ : చిత్తూరు అపోలో యూనివర్సిటీ లో విద్యార్థినుల బాత్ రూమ్ లో రహస్య కెమెరాల వ్యవహారం పై పోలీస్ విచారణ కొనసాగుతున్నదని, దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ వారిని కోరానని మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయ భారతి సాయనీ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ ని జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సందర్శించి యూనివర్సిటీ సిబ్బందితో తో సమీక్ష నిర్వహించారు.అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్ రూమ్ లో రహస్య కెమెరాల వ్యవహారంను వార్తా పత్రికలు, టివి చానళ్ళ ద్వారా చూసి మానవ హక్కుల ఉల్లంఘన కింద సోమోటోగా తీసుకుని విచారణకు రావడం జరిగిందని తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీస్ విచారణ జరుగుతున్నదని, పూర్తి వివరాలను వెలువరించలేమని అన్నారు. అనుమానితులను పోలీస్ అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారని తెలిపారు. పోలీస్ అధికారులు పారదర్శకతతో విచారణను వేగవంతం చేసి దోషులను తొందరగా న్యాయస్థానం ముందు నిలిపి శిక్షపడేలా చూడాలని కోరామన్నారు. కళాశాలలో నియమాల ప్రకారం విద్యార్థుల సమస్యల పరిష్కారానానికి అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కళాశాల విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడగా సమస్యలెవీ లేవని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వీరితో పాటు కళాశాల ఛైర్మన్, అధ్యపకులతో సమీక్షించడం జరిగిందన్నారు.ఈ సమీక్షా సమావేశంలో లైసెన్ ఆఫీసర్లు, ఎన్ జ్యోతి, హరినాథ్ రెడ్డి, విశ్వవిద్యాలయ ఉపకులపతి వినోద్ బట్, డి.ఎస్.పి, సాయినాథ్, సీఐ నిత్య బాబుచీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నరేష్ రెడ్డి,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :