Monday, 02 March 2026 12:26:26 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఘనంగా కే.పి.ఏల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..

Date : 11 January 2026 07:03 PM Views : 373

Famous TV - క్రీడలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, డి. రాజులూరు వద్ద,క్షత్రియ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11సీజన్ క్రికెట్ టోర్నమెంట్,సంక్రాంతి పండుగ సందర్భంగా చౌడేపల్లి మండలం రాజులూరు కేపీఏల్ మైదానం నందు ఆదివారం రాజులూరు సుదర్శన్ రాజు, జతిన్ ఇంఫ్రా కంపెనీ ఎం.డి పురుషోత్తం రాజు ల ఆధ్వర్యంలో 11వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా క్షత్రియ సంఘం నాయకులు భక్తవత్సల రాజు,భాస్కర్ రాజు,లక్ష్మణ్ రాజు, వెంకటరమణ రాజు, సుబ్రహ్మణ్యం రాజు,శంకర్ రాజు,మేకం జమానపల్లె పురుషోత్తం రాజు,లోకేష్ రాజు లు పాల్గొన్నారు. టోర్నమెంట్ మొదట పూజ కార్యక్రమం లో జ్యోతి వెలిగించి మైదానం లో కె.పి.ఏల్ ఫ్లాగ్ ఎగురవేసి క్రికెట్ జెట్ల క్యాప్టన్ లతో టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 13సంవత్సరాలు గా కొనసాగుతున్న క్షత్రియ కేపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ కోవిడ్ సమయం రెండు సంవత్సరాలు వదలి 11 సంవత్సరాలు గా ఈ టోర్నమెంట్ నడుపుతున్నామని,ఈ ఏడాది 13 టీమ్ లు పోటీలో పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లతో కొనసాగి మొదటి, రెండవ, మరియు మూడవ రన్నర్స్ టీమ్ లకు ప్రైజ్ మని తో పాటుగా టూ వీలర్,ల్యాప్ టాప్ మరియు ఎల్ ఈ డి టివి లను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్షత్రియ యువతను చైతన్యం చేయడమే ఈ కే.పీ.ఎల్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని, గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేపీఎల్ మ్యాచ్ లలో చౌడేపల్లి మండలం పుంగనూరు చెందిన క్షత్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారని, ప్రతి సంక్రాంతి కొత్తదనంతో యువత క్రీడారంగంలో ఉన్నత స్థాయి చేరుకోవాలని కే పి ఎల్ మ్యాచ్ లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో క్షత్రియ సంఘం నాయకులు, కేపీఎల్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రికెట్ జట్లు, ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :