Sunday, 19 April 2026 05:36:33 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ఎస్. వి వైద్య కళాశాలలో నిరంతర వైద్య విద్య కార్యక్రమం

Date : 31 March 2024 04:24 PM Views : 555

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : తిరుపతి, శ్రీ వెంకటేశ్వరా వైద్య కళాశాల, రోగ నిర్ధారణ శాస్త్రం (dept. Of pathology) వారి ఆధ్వర్యంలో నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని (continuous medical education) నిర్వహించారు. రక్త సంబంధించిన సమస్యలను గురించి ఈ సదస్సులో క్లుప్తంగా చర్చించడం జరిగింది. హెమటోపాథాలజీ అనేది లుకేమియా, లింఫోమా మరియు అనేక ఇతర రక్త రుగ్మతలు వంటి రుగ్మతలతో సహా రక్త కణాలు మరియు కణజాలాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం మరియు నిర్ధారణతో వ్యవహరించే పాథాలజీ యొక్క ఒక విభాగం. రక్తం మరియు శోషరస వ్యవస్థలను ప్రభావితం చేసే వ్యాధులను గుర్తించడానికి మరియు వర్గీకరించడానికి రక్తపు స్మెర్స్, ఎముక మజ్జ నమూనాలు, శోషరస కణుపు బయాప్సీలు మరియు ఇతర కణజాలాలను హెమటోపాథాలజిస్టులు విశ్లేషిస్తారు. ఈ కార్యక్రమములో డా"రేవంత్, అస్టర్ హాస్పిటల్, బెంగళూరు; డా"ప్రదీప్, ఆనంద్ లాబ్స్, బెంగళూరు; డా"రామస్వామి, ప్రధానచార్యులు, పి ఇ. ఎస్. వైద్య కళాశాల, కుప్పం, మొదలగు పేరుగాంచిన వైద్యులు పాల్గొని పీ.జీ వైద్య విద్యార్థులకు బోధించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఇటువంటి కార్యక్రమాలు రోగనిర్ధారణ శాస్త్ర అభివృద్ధికి ఎంతో అవసరం అని, ఆసుపత్రిలో ఉన్న వైద్యులకు మరియు ల్యాబ్ లో ఉన్న వైద్యులకు వైద్య రంగంలో కలుగుతున్న కొత్త కొత్త మార్పులను అందిపుచ్చుకొని రోగ నిర్ధారణ చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారిని కోరారు. రోగ నిర్ధారణ శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినదని, ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక పేషెంట్ లకు సెంట్రల్ ల్యాబ్ సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు ఎప్పటికప్పుడు, అందించినట్లయితే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చునని ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా"జి.రవిప్రభు అన్నారు. ఈ కార్యక్రమములో రోగ నిర్ధారణ శాస్త్ర విభాగాధిపతి డా"భ్రమరాంబ; ఆచార్యులు డా" ఇంద్రాణి; మైక్రోబయాలజీ ఆచార్యులు, డా" డి. వి. ఎస్. మూర్తి; జనరల్ మెడిసిన్ ఆచార్యులు, డా" ఋషెంద్ర కుమారి; రోగ నిర్థారణ శాస్త్ర సహాయ ఆచార్యులు డా"నాగరాజ; డా"రాజశేఖర్; డా"స్వర్ణలత; డా"సుష్మ మరియు ఇతర సిబ్బంది, పీజీ వైద్య విద్యార్థులు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు మొదలగు పట్టణాలలోని వైద్య కళాశాల లోని పీజీ విద్యార్థులు సుమారు 100 మంది పాల్గొనడం జరిగింది. కొత్త విషయాలను ఈ కార్యక్రమంలో చర్చించడమే కాకుండా ప్రశ్నలు - సమాధానాలు (quiz) చర్చ కార్యక్రమం కూడా నిర్వహించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :