Thursday, 30 July 2026 11:00:52 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రూయా ఆసుపత్రిలో నేటి నుండి గ్రహణ మొర్రి సర్జరీలు

Date : 13 March 2024 07:09 PM Views : 734

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : బుధవారము మిషన్ స్మైల్ సంస్థ ఆధ్వర్యంలో రుయా ఆస్పత్రి నందు ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీషియా విభాగం వారి సహకారం తో, గ్రహణం మొర్రి సర్జరీలు 13 వ తారీఖు నుండి 17 వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రహణం మొర్రితో బాధపడుతున్నవారు, వారి బంధువర్గం, వారికి తెలిసినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవలసినదిగా రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు తెలిపారు. ఈ ఆవకాశాని సద్వినియోగం చేసుకోవలసినదిగా ప్రజలను కోరినారు. సదరు క్యాంపునకు ముఖ్యంగా తెలంగాణ, బెంగుళూరు, కృష్ణగిరి నుండి ప్రసిద్ధిగాంచిన ప్రముఖ వైద్యుల సహకారంతో ఈ సర్జరీలు నిర్వహించబడును. కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మెరుగైన వైద్యం పొందగలరు. ఈ క్యాంపులో సర్జరీ చేసుకున్న వారికి, జగన్ అన్న ఆసరా పదకం ద్వారా లబ్ది కూడా చేకూరుతుంది. ఈ కార్యక్రమానికి ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు (పరిపాలన ), అనస్తీశాలజీ విభాగాధిపతి డాక్టర్ రాధా , ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి, అనస్థీషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ యాదవ్, నర్సింగ్ సూపరిటెండెంట్ అరుణమ్మ, వైద్యులు పిజి వైద్య విద్యార్థులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.రుయా ఆసుపత్రి ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.మొదటిరోజు స్క్రీనింగ్ టెస్ట్ లో గ్రహణ మొర్రి తో బాధపడుతున్న 30 మంది పిల్లలను సర్జరీ కొరకు ఎంపిక చేసినట్లు సర్జరీ స్పెషలిస్టులు తెలిపినారు.రుయా ఆసుపత్రిలో ప్రతి బుధ శనివారాలలో ప్లాస్టిక్ సర్జరీ విభాగము నందు గ్రహణ మొర్రి సర్జరీలు నిర్వహించబడునని ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రహణ మొర్రి తో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :