Famous TV - ఆరోగ్యము / తిరుపతి : రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు , మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం , చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి కి టీటీడీ దేవస్థానం పాలక మండలి నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంతోకాలంగా క్షయ వ్యాధిగ్రస్తులకు రుయా ఆసుపత్రి నందు నూతన భవన నిర్మాణం కొరకు ఎదురుచూస్తున్న సమయంలో టీటీడీ దేవస్థానం ఒక కోటి ₹:1.79 లక్షలు సహాయార్థం అందించడం వలన క్షయ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించవచ్చునని, క్షయ వ్యాధికి సంబంధించిన పరికరములు, సమకూర్చ వచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాడు నేడు క్రింద 50 పడకల వసతితో క్రిటికల్ కేర్ బ్లాక్ 23.75 కోట్లతో త్వరలో నిర్మాణం జరుగుతుందని డాక్టర్ జి.రవి ప్రభు ఈ సందర్భంగా తెలిపారు. 25.44 కోట్ల తో అక్యుట్ కేర్ విభాగము, మరియు వైద్య విద్యార్థులకు లెక్చరర్ గ్యాలరీ సుమారు 26.91 కోట్లతో నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. పేద రోగులకు మెరుగైన వైద్యము మెరుగైన వైద్య విద్యను అందించవచ్చునని అని అన్నారు. విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ అడిగిన వెంటనే తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్ అయిన తర్వాత పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అయిన రుయా ఆసుపత్రి అయినా రెండు రెండు కళ్ళు లాంటివి అని ఆ రోజు ఆయన అన్నారు ఆయన అన్న మాట ప్రకారము ఈరోజు టీటీడీ పాలకమండలి సమావేశంలో ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం తిరుపతి శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామని డాక్టర్ సుబ్బారావు తెలిపారు . ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు వైద్య సిబ్బంది, రుయా ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది మరియు ఎస్వీ వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV