Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ప్రజలకు కంటి సమస్యలకు వైద్యులు మెరుగైన సేవలు అందించమే లక్ష్యంగా పని చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆప్తల్మిక్ సొసైటీ, తిరుపతి ఆప్తల్మిక్ సొసైటీ ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ సురేంద్ర శెట్టి తెలిపారు. తిరుపతి లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న కంటి వైద్య నిపుణుల సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా సుమారు 100 మంది కంటి వైద్య నిపుణులు పలు అంశాలపై చర్చించారు. కంటి వైద్య చికిత్స, ఆపరేషన్, ఆధునిక కంటి వైద్య విధానం పై అవగాహన అంశాల పై సదస్సు జరిగింది. ఆదివారం ముగింపు సమావేశం నిర్వహిస్తారు. కార్యక్రమంలో సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇందిరా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు పాల్గొన్నారు.
Admin
Famous TV