Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శనివారము ఎస్వీ వైద్య కళాశాల, అనస్థీషియా విభాగము నందు " పోకస్" వర్క్ షాప్ అనస్థీషియా విభాగము మరియు క్రిటికల్ కేర్ యూనిట్ తిరుపతి వారు కలసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ను అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డా.చంద్రశేఖరన్, రుయా సూపరిండెంటెంట్ డా .రవి ప్రభు, అనస్థీషియా హెచ్ ఒ డి డా.రాధా, మరియు ఇతర ఫ్యాకల్టీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫాకల్టీ గా డా .కార్తిక్ ,డా సూర్య ప్రకాష్ యశోద హాస్పిటల్స్ నుంచి,డా సునీల్ ,ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ నుంచి,డా సింధు వైజాగ్ అపోలో నుంచి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి. వైద్య కళాశాల వైద్య సిబ్బంది, మరియు కడప మెడికల్ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రోజు రోజుకి పెరిగి పోతున్న వైద్య విద్యా ప్రమాణాలకి అనుగుణంగానే ఇప్పుడు జరిగే వర్క్ షాప్ అందరి విద్యార్థులకు ఉపయోగ పడుతుంది అని ,దీని ద్వారా రోగులకు కూడా మరింత ఆధునిక వైద్యం అందించడం జరుగుతుంది అని తెలియ చేశారు.ఈ కార్య క్రమంలో విద్యార్థులు వుత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్య క్రమం లో ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ తిరుపతి యూనిట్, ( ఐ ఎస్ సి సి ఎం),(ISCCM) తిరుపతి, యూనిట్ అధ్యక్షులు డా మదన్ మోహన్ రెడ్డి ,సెక్రటరీ డా జీవన్, కోశాధికారి డా రాణా ప్రతాప్ మరియు ఎస్ వి వైద్య కళాశాల, వైద్య అధ్యాపకులు డా. శ్రీనివాసరావు సూరి శెట్టి, డా.శ్రీనివాస్ యాదవ్, డా.విజయ్ భాస్కర్, డా.సునీల్,డా మైథిలి, డా జ్ఞాపిక డాక్టర్ కిరణ్ ఆశ్ర హాస్పిటల్, డాక్టర్ ఆనంద్ శ్రీకర్ హాస్పిటల్ , మరియు డాక్టర్ హేమంత్ అమర హాస్పిటల్ నుంచి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV