Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ప్రపంచ జనాభా దినోత్సవము: 11.07.2023. డాక్టర్ U.శ్రీ హరి గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి,తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యాక్రమం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం,తిరుపతి నుండి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ ర్యాలీని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు,డాక్టర్ శ్రీనివాసరావు,డాక్టర్ శ్రీ నివాసులరెడ్డి,డాక్టర్ రూప్కుమార్,హరినాథ్,కిరణ్ నాయక్,జుబేర్,శ్వేత ఎస్వో నాగేంద్ర కుమార్, డిప్యూటీ డెమో కిరణ్ కుమార్, ANMలు,ఆశాకార్యకర్తలతో మరియు నర్సింగ్ విద్యార్థినులతో టౌన్ క్లబ్ వరకు నిర్వహించడమైనది. స్విమ్స్ కూడలి నందు మానవహారము ఏర్పాటు చేసి అందరిచే ప్రతిజ్ఞ చేయించడమైనది.ఈ సందర్భముగా డాక్టర్ శ్రీ హరి గారు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,తిరుపతి వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరిగిపోతున్నదని,తద్వారా తలెత్తే దుష్పరిణామాలను నివారించేందుకు,అధిక జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జూలై 11వ తేదిన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల,తగ్గుకు సంబంధించిన వపత్రిక ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్య సమితి 1987 వ సంవత్సరం జూలై 11 వ తేదిని ప్రపంచ జనాభా దినోత్సవముగా జరుపుకోవాలని ప్రకటించిందని,142కోట్ల జనాభాతో ప్రపంచంలో మన దేశము మొదటి స్థానంలో ఉందని,ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరము (2023) కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు “స్వాతంత్ర్య అమృత మహోత్సవం పురస్కరించుకుని కుటుంబ సంతోషం మరియు శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిద్దాం అనే నినాదంతో ప్రతిజ్ఞ చేస్తోందని”పేర్కొన్నారు.చిన్న కుటుంబం యొక్క ఆవశ్యకతను తెలియజేసి కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్దతులు మరియు శాశ్వత పద్దతులపై అర్హులైన దంపతులకు (EC) అవగాహన కార్యక్రమములు వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మొదటి దశలో జనాభా సమీకరణ పక్షోత్సవాలు 27.06.2022 నుండి 10.07.2022 వరకు,రెండవ దశలో జనాభా స్థిరీకరణ పక్షోత్సవాలు11.07.2022 నుండి 24.07.2022 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివాహ వయస్సుపైన, కుటుంబ నియంత్రణ పద్దతులపైన,బిడ్డబిడ్డకు ఎడం పైన,అవగాహన కల్పించి తల్లిబిడ్డ సురక్షితంగా ఉండేలా మరియు మాతృమరణాలు, శిశుమరణాలు జరగకుండా చర్యలు చేపట్టాలనే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్దతులైన ఓరల్ పిల్స్(మాల-N),ఛాయ నోటి మాత్రలు,ఈ.జి.పిల్,అంతర ఇంజెక్షన్లు మరియు నిరోధ్, పి.పి.ఐ.యు.సి.డి,కాపర్ - T లాంటి పద్దతులపై అర్హులైన దంపతులకు క్షేత్ర స్థాయిలోని వైద్యాధికారులు,వైద్య సిబ్బంది, ANM, ASHA, అంగన్వాడి కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించి దంపతులు పై పద్దతులను వాడేలా ప్రోత్సహించడం ఈ సంవత్సరం ప్రపంచ జనాభా మాసోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.ప్రతి కుటుంబ సంక్షేమమే మన ప్రభుత్వ ధ్యేయం.చిన్న కుటుంబం - చింతలేని కుటుంబం. - జనాభా నియంత్రణ అందరి ముఖ్య కర్తవ్యం.. - దేశ ప్రగతి, అభివృద్ది, సంక్షేమం,ఆర్థిక స్వాలంభన లక్ష్యాల సాధన మనందరి భాద్యత.. - కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించడం – దేశ జనాభాను అరికట్టడం మన సంకల్పం..అనే నినాదాలతో ర్యాలీ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యస్.వి ఆర్ ఆర్ నర్సింగ్ కాలేజిల విద్యార్థినులు మరియు ఇతర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV