Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శనివారము ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, ఐఏఎస్ , జిల్లా వైద్యాధికారి డాక్టర్ యు. శ్రీహరి, మార్గదర్శకత్వంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం 13. 7.2023 నుండి 22.7. 2023 వరకు 08 రోజులపాటు షెడ్యూల్ చేయబడింది. ఈ ట్రైనింగ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. ప్రసూతి ఆసుపత్రి నందు ఎనిమిది రోజులుగా ప్రధమ చికిత్సలు వాటి ఆవశ్యకత, అనే అంశముల మీద, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కు ఈ తర్ఫీదు ఇవ్వడం జరిగినది. అందువలన గ్రామీణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యంగా నోటి, రొమ్ము, గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ని గుర్తించుటకు స్క్రీనింగ్ పద్ధతుల గురించి థియరీ మరియు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ 15 మంది రిసోర్స్ పర్సన్స్ ద్వారా , ట్రైనింగ్ తీసుకుంటున్న అందరికీ అవగాహన కలిగించడం జరిగినది. వీరికి ఎస్వీ వైద్య కళాశాల, ప్రసూతి ఆసుపత్రి నందు వైద్య విద్య బోధిస్తున్న వైద్య అధ్యాపకులు ద్వారా మెరుగైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. వైద్య లు, వైద్య సిబ్బంది ద్వారా 240 మధ్యస్థాయి ఆరోగ్య ప్రదాత సభ్యులకు శిక్షణ తీసుకున్నారని డాక్టర్ కె.మాధవి నోడల్ ఆఫీసర్,వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఎ. చంద్రశేఖరన్, రిటైర్డ్ రుయా సూపరిటెండెంట్ డాక్టర్ టి. భారతి , ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. పార్థసారధి రెడ్డి , గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ జి. ప్రమీలా దేవి , డాక్టర్ శ్రీనివాస రావు నోడల్ ఆఫీసర్, డి.ఎం. హెచ్. ఓ ఆఫీస్ మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV