Sunday, 19 April 2026 05:36:33 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ప్రపంచ మెదడు దినోత్సవ అవగాహన కార్యక్రమం

Date : 22 July 2023 04:42 PM Views : 460

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శనివారం ఉదయం 11 గంటలకు రుయా ఆసుపత్రి జీరియా ట్రిక్ వార్డ్ నందు రోగులను ఉద్దేశించి ప్రపంచ మెదడు దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మెదడును ఎల్లవేళలా చాలా జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ ), డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారి సూచనల మేరకు ఈరోజు మన ఈ ప్రపంచ మెదడు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. వయోవృద్ధుల వార్డు నందు నరాల వ్యాధిగ్రస్తులు , మూర్చతో బాధపడుతున్న రోగులకు వారి అటెండలకు , వైద్య విద్యార్థులకు మరియు నర్సింగ్ పారామెడికల్ విద్యార్థులకు అవగాహన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెదడు లో కలిగే రోగాలను ఏ విధంగా అరికట్టాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరాలజీ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.రాజేశ్వరి క్లుప్తంగా విసదీకరించి, అందరికీ అవగాహన కలిగించారు. మన శరీరంలో కలుగుతున్న మార్పులు, ఎప్పటికప్పుడు మెదడుకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన మెదడును చాలా జాగ్రత్తగా చూసుకుని, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకొని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించినట్లయితే వెంటనే మెరుగైన వైద్యం అందించడానికి వీలు కలుగుతుంది. క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను , మూర్చ వ్యాధిగ్రస్తులను, చిన్న భారీ వాహనాలు నడుపుతున్న వారు హెల్మెట్లు ధరించి, సీట్ బెల్ట్ ధరించి వాహనములు నడపవలెను. అప్పుడే మన తలకు ఎలాంటి గాయం కలగకుండా మెదడును కాపాడుకోవడం జరుగుతుంది. జాతీయ రహదారులు నందు జరుగుతున్న విపత్తుల వలన మన మెదడుకు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన ప్రాథమిక సూచనలను తప్పకుండా పాటించవలెను. అప్పుడే మెదడును మనం కాపాడుకోవడం సులభతరం అవుతుందని అన్నారూ. మెదడుకు సంబంధించిన వ్యాధుల నుండి రోగులను కాపాడుకోవడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి మంగళవారము మరియు శుక్రవారం రోజు రుయా ఆసుపత్రి ఒపీ విభాగము నందు మెదడుకు సంబంధించిన రోగులను పరీక్షించబడును కావున పురప్రజలందరూ ఈ ఉచిత న్యూరాలజీ విభాగ వైద్య సేవలను అందిపుచ్చుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో రుయా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్ ), డాక్టర్ వసుంధర దేవి, వివిధ విభాగాల పీజీ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ అండ్ ఫిజియోథెర విద్యార్థిని విద్యార్థులు మరియు పారామెడికల్ విద్యార్థిని విద్యార్థు లు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :