Thursday, 30 July 2026 08:28:14 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పరిశోధనలపై ముగిసిన మూడు రోజుల కార్యశాల

Date : 27 September 2023 09:01 PM Views : 680

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : బుధవారము ఎస్వీ వైద్య కళాశాల బహుళ విభాగాల కేంద్రం (ఐ.సీ.ఎం.ఆర్. న్యూఢిల్లీ) వారి ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా (25 సెప్టెంబర్ నుండి 27 సెప్టెంబర్ 2023) జరుగుతున్న కార్యాశాల చివరి రోజు ముగిసినది. గత మూడు రోజులుగా జరిగిన కార్యశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ స్కాలర్స్, వివిధ యూనివర్సిటీ వైద్య మరియు సైన్స్ విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యశాలలో జీవక్రియ రుగ్మతలలో జన్యువులు, ప్రోటీన్ల వ్యక్తీకరణ, మరియు బయోమెడికల్ పరిశోధనలో ఇటీవలి పురోగతి ఉపయోగముల గురించి ఆర్టి.పి.సి.ఆర్, ఎలిసా, సి.ఎల్. ఐ.ఏ, మరియు బయో కెమిస్ట్రీ అనలైజర్ అనే మిషనరీ మీద వారికి ప్రయోగాలు నేర్పించడం, తెలియజేయడం జరిగినది. ఇందులోనే భాగంగా డా. పాకాల సురేష్, డా. బి . హరి కృష్ణ, డా. ఫహీమ్ పాల్గొన్న పరిశోధనా విద్యార్థులకు వివిధ అంశాల మీద చర్చ సమావేశం, మరియు ప్రయోగాలు వారి ద్వారా చేసి వారికి చెప్పడం జరిగినది. ఈ వర్క్ షాప్ నందు దాదాపుగా 25 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ఇలాంటి వర్క్ షాప్స్ ను ఇంకా కొన్ని ప్రయోగాలు, నేర్పించినట్లయితే, ప్రజలకు రోగులకు వ్యాధులపై మెరుగైన పరిశోధనలు జరిపి ఉత్తమమైన వైద్యం అందించడానికి ఇలాంటి పరిశోధనలు యూజీ, పీజీ విద్యార్థులకు ఎంతైనా అవసరమని పరిశోధన విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. మెరుగైన పరిశోధనలు వలన వ్యాధి నిర్ధారణ చేయడానికి , రోగి కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అని అన్నారు. వర్క్ షాప్ లో చివరిగా ప్రశంశా పత్రములను డాక్టర్ కిరీటి నోడల్ ఆఫీసర్, చిన్న పిల్లల విభాగం, డా. ఫహీమ్ , డా. బి . హరి కృష్ణ , డాక్టర్ మధుసూదన్ , వర్క్ షాప్ లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంశా పత్రములను అందజేయడం జరిగినది. ఇందులో ఎం ఆర్ యు సిబ్బంది ధనమ్మ, లోకనాథ్, ల్యాబ్ టెక్నీషియన్స్, చాణుక్య, పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :