Famous TV - ఆరోగ్యము / తిరుపతి : బుధవారము ఎస్వీ వైద్య కళాశాల బహుళ విభాగాల కేంద్రం (ఐ.సీ.ఎం.ఆర్. న్యూఢిల్లీ) వారి ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా (25 సెప్టెంబర్ నుండి 27 సెప్టెంబర్ 2023) జరుగుతున్న కార్యాశాల చివరి రోజు ముగిసినది. గత మూడు రోజులుగా జరిగిన కార్యశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ స్కాలర్స్, వివిధ యూనివర్సిటీ వైద్య మరియు సైన్స్ విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యశాలలో జీవక్రియ రుగ్మతలలో జన్యువులు, ప్రోటీన్ల వ్యక్తీకరణ, మరియు బయోమెడికల్ పరిశోధనలో ఇటీవలి పురోగతి ఉపయోగముల గురించి ఆర్టి.పి.సి.ఆర్, ఎలిసా, సి.ఎల్. ఐ.ఏ, మరియు బయో కెమిస్ట్రీ అనలైజర్ అనే మిషనరీ మీద వారికి ప్రయోగాలు నేర్పించడం, తెలియజేయడం జరిగినది. ఇందులోనే భాగంగా డా. పాకాల సురేష్, డా. బి . హరి కృష్ణ, డా. ఫహీమ్ పాల్గొన్న పరిశోధనా విద్యార్థులకు వివిధ అంశాల మీద చర్చ సమావేశం, మరియు ప్రయోగాలు వారి ద్వారా చేసి వారికి చెప్పడం జరిగినది. ఈ వర్క్ షాప్ నందు దాదాపుగా 25 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ఇలాంటి వర్క్ షాప్స్ ను ఇంకా కొన్ని ప్రయోగాలు, నేర్పించినట్లయితే, ప్రజలకు రోగులకు వ్యాధులపై మెరుగైన పరిశోధనలు జరిపి ఉత్తమమైన వైద్యం అందించడానికి ఇలాంటి పరిశోధనలు యూజీ, పీజీ విద్యార్థులకు ఎంతైనా అవసరమని పరిశోధన విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. మెరుగైన పరిశోధనలు వలన వ్యాధి నిర్ధారణ చేయడానికి , రోగి కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అని అన్నారు. వర్క్ షాప్ లో చివరిగా ప్రశంశా పత్రములను డాక్టర్ కిరీటి నోడల్ ఆఫీసర్, చిన్న పిల్లల విభాగం, డా. ఫహీమ్ , డా. బి . హరి కృష్ణ , డాక్టర్ మధుసూదన్ , వర్క్ షాప్ లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంశా పత్రములను అందజేయడం జరిగినది. ఇందులో ఎం ఆర్ యు సిబ్బంది ధనమ్మ, లోకనాథ్, ల్యాబ్ టెక్నీషియన్స్, చాణుక్య, పాల్గొన్నారు.
Admin
Famous TV