Sunday, 19 April 2026 05:42:16 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

పరిశోధనలపై ముగిసిన మూడు రోజుల కార్యశాల

Date : 27 September 2023 09:01 PM Views : 627

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : బుధవారము ఎస్వీ వైద్య కళాశాల బహుళ విభాగాల కేంద్రం (ఐ.సీ.ఎం.ఆర్. న్యూఢిల్లీ) వారి ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా (25 సెప్టెంబర్ నుండి 27 సెప్టెంబర్ 2023) జరుగుతున్న కార్యాశాల చివరి రోజు ముగిసినది. గత మూడు రోజులుగా జరిగిన కార్యశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ స్కాలర్స్, వివిధ యూనివర్సిటీ వైద్య మరియు సైన్స్ విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యశాలలో జీవక్రియ రుగ్మతలలో జన్యువులు, ప్రోటీన్ల వ్యక్తీకరణ, మరియు బయోమెడికల్ పరిశోధనలో ఇటీవలి పురోగతి ఉపయోగముల గురించి ఆర్టి.పి.సి.ఆర్, ఎలిసా, సి.ఎల్. ఐ.ఏ, మరియు బయో కెమిస్ట్రీ అనలైజర్ అనే మిషనరీ మీద వారికి ప్రయోగాలు నేర్పించడం, తెలియజేయడం జరిగినది. ఇందులోనే భాగంగా డా. పాకాల సురేష్, డా. బి . హరి కృష్ణ, డా. ఫహీమ్ పాల్గొన్న పరిశోధనా విద్యార్థులకు వివిధ అంశాల మీద చర్చ సమావేశం, మరియు ప్రయోగాలు వారి ద్వారా చేసి వారికి చెప్పడం జరిగినది. ఈ వర్క్ షాప్ నందు దాదాపుగా 25 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ఇలాంటి వర్క్ షాప్స్ ను ఇంకా కొన్ని ప్రయోగాలు, నేర్పించినట్లయితే, ప్రజలకు రోగులకు వ్యాధులపై మెరుగైన పరిశోధనలు జరిపి ఉత్తమమైన వైద్యం అందించడానికి ఇలాంటి పరిశోధనలు యూజీ, పీజీ విద్యార్థులకు ఎంతైనా అవసరమని పరిశోధన విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. మెరుగైన పరిశోధనలు వలన వ్యాధి నిర్ధారణ చేయడానికి , రోగి కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అని అన్నారు. వర్క్ షాప్ లో చివరిగా ప్రశంశా పత్రములను డాక్టర్ కిరీటి నోడల్ ఆఫీసర్, చిన్న పిల్లల విభాగం, డా. ఫహీమ్ , డా. బి . హరి కృష్ణ , డాక్టర్ మధుసూదన్ , వర్క్ షాప్ లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంశా పత్రములను అందజేయడం జరిగినది. ఇందులో ఎం ఆర్ యు సిబ్బంది ధనమ్మ, లోకనాథ్, ల్యాబ్ టెక్నీషియన్స్, చాణుక్య, పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :