Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఆదివారము ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి ఆవరణంలో భారత ప్రభుత్వం పిలుపుమేరకు స్వచ్ఛతా హి సేవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్. వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి రుయా ఆసుపత్రి లోని బహుళ విభాగాల పరిశోధన కేంద్రం (ఐ సి ఎం ఆర్ న్యూఢిల్లీ) వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతకి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాలు అన్ని శుభ్రం చేసి, ప్రతి ఒక్కరు వారి వారి ఆఫీసును, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ఎస్వీ వైద్య కళాశాల ఆట స్థలం చుట్టూ చెట్ల నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. వైద్య విద్యార్థిని, విద్యార్థుల ద్వారా చెట్లను ఈ ఐదు సంవత్సరాలు పాటు మా సొంతంగా కాపాడి ఈ కళాశాలకు మంచి( గ్రీనరీ) పచ్చదనంతో ఉంచాలన్న ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రమాణం చేస్తున్నాము అని అన్నారు. వైద్య విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆరోగ్యవంతంగా జీవిద్దాం స్వచ్ఛతా హి సేవ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ వెంకటేశ్వర్లు , బహుళ విభాగాల పరిశోధన కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ కిరీటి, మెడిసిన్ విభాగ ప్రొఫెసర్ మరియు హాస్టల్ వార్డెన్ డాక్టర్ తులసీరామ్, ఎం ఆర్ యు శాస్త్రవేత్త డాక్టర్ మధుసూదన్, ఎస్వీ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు, ఎం ఆర్ యు వైద్య సిబ్బంది, రుయా ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది, సార్జెంట్ విజయకుమార్, ఏ వన్ సానిటరీ వర్కర్లు, ఎస్ వి వైద్య కళాశాల సిబ్బంది మరియు పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV