Famous TV - ఆరోగ్యము / తిరుపతి : మదనపల్లికి చెందిన చిన్న రెడ్డప్ప అను 60 సంవత్సరాలు గల వృద్ధుడు వృత్తిరీత్యా పసుపు తయారీ మిషన్లో ప్రమాదవశాత్తు కుడిచేతి బొటనవేలు తెగిపడింది, హుటాహుటిన అమర హాస్పిటల్ కి బొటన వేలును ఐస్ ప్యాక్ లో ఉంచి హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అనంతరంఆ వ్యక్తికిపరీక్షలు నిర్వహించిఅత్యంత క్లిష్టమైన బొటనవేలు మైక్రోస్కోపీ ద్వారాడాక్టర్ వాసుదేవ రెడ్డి బొటనవేలు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బొటనవేల చికిత్సలో మైక్రోస్కోపీ ద్వారా ఈ శస్త్ర చికిత్స నిర్వహించి, రక్తనాళాలు, కండరాలను ఏర్పరిచి పేషెంట్ కి తన బొటనవేలును పూరస్థితికి తీసుకొచ్చామని తెలిపారు, రెండు వారాలపాటు పేషంటు హాస్పిటల్ లో ఉండి ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు, మరియు ఆరు నెలలపాటువిశ్రాంతి తీసుకోవాలని, అతి తక్కువ ఖర్చుతో అమర హాస్పిటల్ లోని అత్యాధునిక వైద్య సేవలతో ఇలాంటి బొటనవేలు మరియు, చేతి భాగాలు అమరికలు అమర హాస్పిటల్ లోనే విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించామని డాక్టర్ వాసు దేవా రెడ్డి తెలిపారు. అమర హాస్పిటల్ సీఏవో వేణుగోపాల్ మాట్లాడుతూ అమర హాస్పిటల్ లో అధునాతన పరికరాలు, అత్యాధునిక సదుపాయాలు అనుభవజ్ఞులైన డాక్టర్స్ వలనే ఇటువంటి శాస్త్ర చికిత్సలు సాధ్యమవుతున్నాయని వేణుగోపాల్ తెలిపారు. తమ తండ్రికి కొత్త జీవితాన్ని అందించినందుకు వైద్యులకు ఆసుపత్రి సిబ్బందికి పేషంట్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమర హాస్పిటల్ సీఏవోవేణుగోపాల్, మార్కెటింగ్ మేనేజర్ నరసింహారావు, పి ఆర్ ఓ మునినాదం, మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Famous TV