Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో డి పి యూపీ మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులకు అంతర్లీన ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది ముందుగా పాటల పోటీలను ప్రారంభించిన అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు తోడ్పాటు అందిస్తాయని బ్రహ్మానంద చారి అన్నారు క్రీడలతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అన్నారు డిపివీపీ పాఠశాల హెచ్ఎం రమాదేవి ఉర్దూ పాఠశాల హెచ్ఎం ఎం రహీం బేగ్ ఇరువురు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేష్ రమణ మహబూబ్ బాషా అంగన్వాడి టీచర్లు సుకన్య శ్రీదేవి పలుకురు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన 110 మంది విద్యార్థులకు బ్రహ్మానంద చారి బహుమతులు ఇవ్వడం జరిగినది.
Admin
Famous TV