Monday, 02 March 2026 12:26:33 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు - వే ఫౌండేషన్

Date : 07 January 2024 07:36 PM Views : 1437

Famous TV - సామాజిక సేవ / : వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా ఎస్.వి. యూనివర్సిటీ లోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం నందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్. వి.యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ ప్రొ. బి. శ్యామ్ డేవిడ్ రాజు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ ఈమె జయంతిని సందర్భంగా వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినలకు సత్కారం ఏర్పాటుచేయడం ముదావహo అని అన్నారు.అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని గుర్తు చేశారు.తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ డా.వెంకట నారాయణ మాట్లాడుతూ సావిత్రి బాయ్ పూలే నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి,కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.ఆమె ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.కుల వ్యవస్థకు వ్యతిరేకంగా,పితృస్వామ్యానికవ్యతిరేకంగా శూద్రుల,అస్పృశ్యుల,మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారన్నారు.వే ఫౌండేషన్ వారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. మహదేవమ్మ,డా. శ్రీరాములు, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ అధ్యక్షులు టి. గోపాల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మధుసూదన్, రాయలసీమ మిమిక్రీ అకాడెమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్, గిరిజన నవ సమాజ్ ప్రెసిడెంట్ పి. శివ శంకర్ నాయక్,కె.రెడ్డి ప్రసాద్, డా. కడివేటి మునిరత్నం,మునింద్ర, మునిలక్ష్మి,తేజస్విని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :