Famous TV - సామాజిక సేవ / : వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా ఎస్.వి. యూనివర్సిటీ లోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం నందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్. వి.యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ ప్రొ. బి. శ్యామ్ డేవిడ్ రాజు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ ఈమె జయంతిని సందర్భంగా వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినలకు సత్కారం ఏర్పాటుచేయడం ముదావహo అని అన్నారు.అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని గుర్తు చేశారు.తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ డా.వెంకట నారాయణ మాట్లాడుతూ సావిత్రి బాయ్ పూలే నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి,కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.ఆమె ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.కుల వ్యవస్థకు వ్యతిరేకంగా,పితృస్వామ్యానికవ్యతిరేకంగా శూద్రుల,అస్పృశ్యుల,మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారన్నారు.వే ఫౌండేషన్ వారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. మహదేవమ్మ,డా. శ్రీరాములు, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ అధ్యక్షులు టి. గోపాల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మధుసూదన్, రాయలసీమ మిమిక్రీ అకాడెమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్, గిరిజన నవ సమాజ్ ప్రెసిడెంట్ పి. శివ శంకర్ నాయక్,కె.రెడ్డి ప్రసాద్, డా. కడివేటి మునిరత్నం,మునింద్ర, మునిలక్ష్మి,తేజస్విని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV