Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం జిల్లెల్ల ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు నీటి యొక్క విశిష్టత ఎండల కాలంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు విద్యా విశిష్టతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ సమస్త జీవులకు నీరే ప్రాణాధారమని మనిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకొచ్చని నీరు లేకపోతే కష్టమని అటువంటి నీటిని పొదుపుగా వాడాలని నీటి యొక్క విశిష్టతను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నీరు వేస్ట్ కాకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని చెట్లను పెంచాలని కోరారు అలాగే వేసవికాలంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు పాఠశాల హెచ్ఎం ఎం భాస్కరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం దాతైన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే విద్యా విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం భాస్కరరావు ఉపాధ్యాయులు బసవ నాగమ్మ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు
Admin
Famous TV