Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం నందవరం ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ విశిష్టత వివిధ రకాలైన పుస్తకాలు 165 పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సు ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ అందరి లక్ష్యం కావాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించిన రోజే స్వచ్ఛభారత్ లక్ష్యం నెరవేరుతుందని ప్రతి ఒక్కరు స్వచ్ఛవైపు అడుగులేసి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని దీనికోసమే ప్రతి విద్యార్థి స్వచ్ఛ భారత్ విశిష్టతను గురించి మీ కుటుంబానికి తెలియజేయడమే కాకుండా తమ వంతు బాధ్యతగా ఒక చెట్టునైన నాటి సంరక్షించాలని బ్రహ్మానంద చారి కోరారు పాఠశాల హెచ్ఎం శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు అలాగే మా పాఠశాలకు జ్ఞానదాయకమైన 165 పుస్తకాలు 165 మంది విద్యార్థులకు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు ఉపాధ్యాయుడు నరసింహులు స్వచ్ఛ భారత్ విశిష్టతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీరాములు ఉపాధ్యాయులు పీవీ నరసింహుడు ఎస్ హమ్మద్ హుస్సేన్ నాగరాజు కళ్యాణి మొదలగు వారు మాట్లాడినారు అనంతరం 165 మంది విద్యార్థులకు విజ్ఞానదాయకమైన పుస్తకాలు బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు
Admin
Famous TV