Famous TV - సామాజిక సేవ / తిరుపతి : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తిరుపతి జీవకోనలో ఉన్న సుభాష్ చంద్రబోస్ అనాధ గృహం పిల్లలకు జెఎసి తిరుపతి శాఖ ఆధ్వర్యంలో వ్యక్తిగత సంరక్షణ కిట్లు పంపిణీ చేశారు. పిల్లలకు వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, జెసిఐ అంతర్జాతీయ కమిషన్ చైర్మన్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి, జోష్ ప్రాపర్టీస్ అధినేత డాక్టర్ ఈశ్వర ప్రకాష్ మెడికేర్ డైరెక్టర్ కె వి చౌదరి, జెఎసి జోన్ వైస్ చైర్మన్ జి శంకరయ్య, జెసిఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు ఆర్ శేషసాయి, అనాధ గృహం నిర్వాహకుడు కృష్ణమూర్తి, జెఎసి ఫౌండేషన్ డైరెక్టర్ గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Famous TV