Famous TV - సామాజిక సేవ / తిరుపతి : టెన్త్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సొసైటీ ఫర్ సోషల్ సర్వీస్ సెక్రటరీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పద్మావతీపురం లోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు విద్యాసామగ్రి వితరణ చేశారు. అతిధులుగా దాతలు డా॥ వై. ప్రవీణ్, జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్, జె.సి.ఐ. ఇండియా ఉపాధ్యక్షులు ఎన్.బి.హర్షవర్ధన్ రెడ్డి, తిరుపతి ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు వై.ఎస్.బాబు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే సూచనలిచ్చారు. ప్రధానోపాధ్యాయులు మధు మరియు ఉపాధ్యాయులు సంస్థని, దాతలని అభినందించారు.
Reporter
Famous TV