Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం తిమ్మాపురం ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నుల పంపిణీ మరియు వేసవిలో పక్షుల మూహదివాల దాహార్తిని తీర్థం విద్య ఆవశ్యకతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ప్రకృతిలో మూగ జీవాలు పక్షుల దాహార్తి తీర్చడం మానవాళి నైతిక బాధ్యతని బ్రహ్మానందచారన్నారు వేసవికాలంలో నీటి కొరత ఎక్కువ ఉన్నందున పక్షులు మూగజీవాలు నీరు దొరకక ఇబ్బందులు పడుతున్నాయని కావున నోరు లేని మూగ జీవాలకు దాహం తీర్చడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు ప్రతి ఒక్కరు తమ తమ ఇండ్లలో నీటి తొట్టెలు బర్డ్ ఫీడర్ కాళీ ప్రదేశంలో ఇంటిపై ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరారు పాఠశాల హెచ్ఎం పుల్లయ్య మాట్లాడుతూ విద్యా ఆవశ్యకత ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఈ ఆర్ వో తేజస్విని సచివాలయ ఉద్యోగస్తులు ప్రవీణ్ సుబ్రహ్మణ్యం పుల్లయ్య వాలంటీర్ సుధాకర్ గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు
Admin
Famous TV