Famous TV - సామాజిక సేవ / తిరుపతి : శనివారము రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, ఆధ్వర్యంలో కంటి (ఆఫ్తమాలజీ ) విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి పర్యవేక్షణలో ఆనారోగ్యంతో బాధపడుతూ రుయా ఆసుపత్రి డయాలసిస్ విభాగం నందు చికిత్స పొందుతూ మరణించిన వేలంపల్లి వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లాకు చెందిన సి హెచ్. సాయిరాం, 33 సంవత్సరాల యువకుడు వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రుయా ఆసుపత్రి కళ్ళ బ్యాంకుకు అతని కళ్ళు దానం చేయడం ఎంతో గొప్ప విషయమని , యువకులు ఈ విధంగా ముందుకు రావడంతో యువతకు చైతన్యం కలిగించినట్లు, ఉంటుందన్నారు. చనిపోయిన అనంతరం మన యొక్క అవయవాలు పదిమందికి ఉపయోగకరంగా ఉంటుందని గ్రహిస్తున్న యువత . కావున ఎవరైనా కళ్ళు గాని అవయవ దానం గాని ముందుకొచ్చినట్లయితే కళ్ళ విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి , కళ్ళ విభాగ టెక్నీషియన్ ని రమేష్, అతని సెల్ ఫోన్ నెంబర్: 99484 88597 కు విషయాలు తెలిపరిచినట్లయితే విభాగాధిపతి కి రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ తో చర్చించి కళ్ళు దానం తీసుకుని కళ్ళు లేని పేద రోగులకు అమర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ విధంగా కళ్ళు లేని వారు మేము అంధులము కాదు అని వారి జీవిత కాలాన్ని కొనసాగించడానికి చేదోడుగా ఉంటుందని కళ్ళు దానం చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు, కళ్లదాన సర్టిఫికెట్ వారికి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళ్ళ విభాగ టెక్నీషియన్ రమేష్, ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV